Revanth Reddy: కేంద్ర ఎన్నికల సంఘంపై ఫైర్.. టీఆర్ఎస్ స్థానాన్ని మార్చాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Fires On Central Election Commission For Changing TRS Place In Ballet Paper: రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికలు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాలెట్లో పేర్లు పొందుపరిచే విషయంలో.. మునుగోడు రిటర్నింగ్ అధికారి నాలుగో స్థానంలో ఉండాల్సిన టీఆరెస్ను రెండో స్థానంలో ఉంచారన్నారు. జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లను ముందుంచి.. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల పేర్లను పెట్టాలన్నారు. టీఆర్ఎస్ ఇంకా జాతీయ పార్టీ కాలేదని.. పైగా అభ్యర్థి టీఆర్ఎస్ తరఫునే నామినేషన్ వేశారని అన్నారు. బ్యాలెట్ పేపర్ను మరోసారి పరిశీలించి.. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం సీరియల్ నంబర్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే.. అనుమతి లేని వాహనాలను కూడా సీజ్ చేయాలని కోరారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ర్యాలీల్లో అనుమతి లేని వాహనాలు తిరుగుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనుమతి లేని వాహనాలు బహిరంగంగా తిరుగుతున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుండా కళ్లు మూసుకుందా? అని ప్రశ్నించారు. అందరికీ ఒకే రకమైన నియమావళిని అమలు చేయాలన్న ఆయన.. ఎన్నికల నిబంధనలు కేసీఆర్కు వర్తించవా? అని నిలదీశారు. మందు సరఫరా చేసిన మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మంత్రులు ప్రభుత్వ వాహనాలలో వచ్చి ప్రచారం చేస్తున్నారని.. ఇది నూటికి నూరు శాతం నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ వాళ్లు నిరంతరం దాడులు చేస్తున్నారని ఆరోపించారు. స్వయంగా రాజగోపాల్ రెడ్డి తమ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారని.. అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కనీసం ఎన్నికల అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదని వాపోయారు.
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
తాజావార్తలు
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!