Revanth Reddy: కేంద్ర ఎన్నికల సంఘంపై ఫైర్.. టీఆర్ఎస్ స్థానాన్ని మార్చాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Fires On Central Election Commission For Changing TRS Place In Ballet Paper: రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికలు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాలెట్లో పేర్లు పొందుపరిచే విషయంలో.. మునుగోడు రిటర్నింగ్ అధికారి నాలుగో స్థానంలో ఉండాల్సిన టీఆరెస్ను రెండో స్థానంలో ఉంచారన్నారు. జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లను ముందుంచి.. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల పేర్లను పెట్టాలన్నారు. టీఆర్ఎస్ ఇంకా జాతీయ పార్టీ కాలేదని.. పైగా అభ్యర్థి టీఆర్ఎస్ తరఫునే నామినేషన్ వేశారని అన్నారు. బ్యాలెట్ పేపర్ను మరోసారి పరిశీలించి.. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం సీరియల్ నంబర్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే.. అనుమతి లేని వాహనాలను కూడా సీజ్ చేయాలని కోరారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ర్యాలీల్లో అనుమతి లేని వాహనాలు తిరుగుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనుమతి లేని వాహనాలు బహిరంగంగా తిరుగుతున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుండా కళ్లు మూసుకుందా? అని ప్రశ్నించారు. అందరికీ ఒకే రకమైన నియమావళిని అమలు చేయాలన్న ఆయన.. ఎన్నికల నిబంధనలు కేసీఆర్కు వర్తించవా? అని నిలదీశారు. మందు సరఫరా చేసిన మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మంత్రులు ప్రభుత్వ వాహనాలలో వచ్చి ప్రచారం చేస్తున్నారని.. ఇది నూటికి నూరు శాతం నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ వాళ్లు నిరంతరం దాడులు చేస్తున్నారని ఆరోపించారు. స్వయంగా రాజగోపాల్ రెడ్డి తమ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారని.. అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కనీసం ఎన్నికల అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదని వాపోయారు.
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!