Revanth Reddy : కర్ణాటక ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు చేరారు. ఈ నేపథ్యంలో వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని ఎవడు ఓడించలేడు అనుకున్నానని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి చూపించిందన్నారు. జేడీఎస్ కోసం.. కాంగ్రెస్ ని చీల్చాలని .. కేసీఆర్ కూడా కృషి చేశారని ఆయన మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో బీఆర్ఎస్కి… కర్నాటకలో బీజేపీ కి పోలిక ఉందని, ఇక్కడ 30 శాతం కమిషన్ సర్కార్, కర్ణాటక లో 40 శాతం కమిషన్ సర్కార్ అని ఆయన అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు నాకే సిగ్గు ఐతుందన్న రేవంత్ రెడ్డి.. కానీ కేసీఆర్ పక్కన ఎలా కూర్చోపెట్టుకుంటున్నారోనని సెటైర్లు వేశారు.
Also Read : Kishan Reddy : PFC ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో నంబర్ వన్ తెలంగాణ
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
దుర్గం చిన్నయ్య నో.. దుర్బుద్ధి చిన్నయనో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఏ అరాచకం చూసినా బీఆర్ఎస్ నాయకులు ఉంటున్నారని, ఇంతకు ముందు… రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణలు వచ్చేవని, కానీ ఇప్పుడు అత్యాచారం కేసుల్లో కూడా బీఆర్ఎస్ నేతలు ఉంటున్నారన్నారు. టీఎస్సీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సమీక్ష చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ అధికారులు.. ప్రభుత్వ పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం తప్పని కోర్టు చెప్పిందని, ప్రశ్నా పత్రం లీకుకి కేటీఆర్ కారణమని, కేటీఆర్ని బర్తరఫ్ చేయాలన్నారు. అంతేకాకుండా.. ఆయన ధన దహమే లీకులకు కారణమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఇంచార్జి మానిక్ రావ్ థాక్రేతో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి.. నాగం జనార్థన్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు.
Also Read : Kishan Reddy : PFC ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో నంబర్ వన్ తెలంగాణ
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..