Congress: రాహుల్ గాంధీ ఈడీ విచారణ.. రాజ్ భవన్ ముట్టడికి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని మూడు రోజులుగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. ఢిల్లీలో ఈడీ ఆఫీస్ ముందే కాంగ్రెస్ అగ్రనేతలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తాజాగా రాహుల్ గాంధీ ఈడీ విచారణపై తెలంగాణ కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గురువారం రాజ్ భవన్ ముందు నిరసన తెలపనున్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. రేపు ఉదయం 10 గంటలకు పీజేఆర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా రాజ్ భవన్ వరకు వెళ్లనున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకావాలని రేవంత్ రెడ్డి కోరారు. జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాాలయాల ముందు నిరసన తెలపాలని శ్రేణులకు సూచించారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
ఈడీ విచారణపై రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ అనుబంధ సంస్థగా ఈడీ మారిందని.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. అర్థరాత్రి వరు విచారణ పేరుతో వేధిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తే, పోలీసులు దారుణంగా దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. ఈ రోజు ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా పోలీసులు వెళ్లారని.. గాంధీ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపులకు బలి చేయాలని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు.
తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వకపోతే..వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా తెలంగాన వచ్చేది కాదని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీకి జరిగిన అవమానం అంటే..దేశ ప్రజల మీద సంస్కృతి మీద దాడి చేసినట్టే అని అన్నారు. అర్థంపర్థం లేని ఈడీ నోటిసులు ఇచ్చి..మీరు కడుక్కొండి అంటే ఎలా అని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీలను ఎదుర్కోలేకే ఈడీ పేరుతో వేధిస్తున్నారని.. రేపు కాంగ్రెస్ తడాఖా ఏమిటో చూపిస్తాం అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.
తాజావార్తలు
-
SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
-
BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
-
IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
-
Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
-
India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!