Registrations for Phantoms : అక్కడ ఆత్మలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేస్తారట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా బతికి వున్న వారి పేరుమీద మాత్రమే ఇళ్ళు, స్థలాలు, వాహనాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ డబ్బులిచ్చవారుంటే చనిపోయినవారి పేరు మీద కూడా చక్కగా రిజిస్ట్రేషన్ చేసేవారున్నారంటే మీరు నమ్ముతారా? ఇచ్చట ఆత్మలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయబడును.! అవును మీరు వింటున్నది నిజమే..! చనిపోయిన వారి పేరుపై కూడా చేసేస్తారు? నమ్మడం లేదా? సరే ఒక్కసారి కరీంనగర్ వెళ్లొద్దాం రండి.
కరీంనగర్లోని సవరన్ స్ట్రీట్ లో 2 గుంటల స్థలంలో ఇల్లు కటకం చంద్రయ్య పేరున ఉంది. అయితే పదేళ్ల క్రితం ఉపాధి కోసం పూణె వెళ్లి స్థిరపడ్డారు. ఇక్కడ ఎవరూ లేకపోవడంతో ఇల్లు శిధిలావస్థకు చేరింది. అయినా ఇంటిపన్ను మాత్రం రెగ్యులర్గా కడుతూ వస్తున్నాడు. ఖాళీగా ఉన్న ఈ ఇంటిపై స్థానిక ప్రజా ప్రతినిధి కన్ను పడింది. కబ్జా చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. కటకం చంద్రయ్య బంధువు నీలమ్మను తెరపైకి తెచ్చాడు. ఆ ఇల్లు నీలమ్మదని… పొరపాటున చంద్రయ్య పేరు రికార్డుల్లో చేర్చారని… ఇప్పుడు తిరిగి నీలమ్మ పేరున మార్చాలని అధికారులపై ఒత్తిడి తెచ్చాడు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
గత మార్చి 21న మునిసిపాలిటీ అధికారులకు నీలమ్మ పేరుతో దరఖాస్తు చేయగా మూడు రోజుల్లో ఆమె పేరుపై ఇల్లు మార్చేశారు. ఇంతవరకు సదరు ప్రజా ప్రతినిధి కథ బాగానే నడిపాడు. తీరా చూస్తే నీలమ్మ 2006లోనే చనిపోవడం… ఆమె డెత్ సర్టిఫికెట్ కార్పొరేషన్ నుంచే ఇవ్వడం జరిగాయన్న విషయం బయటకు రావడంతో కబ్జా కోరు కథ బట్టబయలైంది. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడితో చనిపోయిన మహిళ పేరుపై ఇంటిని మార్చేసిన అధికారులు… ఇప్పుడు వ్యవహారం బయటపడేసరికి తేలుకుట్టిన దొంగల్లా కూర్చున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ రిజిస్ట్రేషన్ పై అధికారులు ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!