Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Reddys In Congress Party Have Sold Out To Kcr Revanth Reddy

Revanth Reddy: రేవంత్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ లోని పెద్ద రెడ్లు ఆ పార్టీకి అమ్ముడు పోయారు..

Published Date :March 14, 2023 , 8:31 am
By NTV WebDesk
Revanth Reddy: రేవంత్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ లోని పెద్ద రెడ్లు ఆ పార్టీకి అమ్ముడు పోయారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Revanth Reddy: మా పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందని అన్నారు. తను PCC chief అయ్యానని, తెలంగాణలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని అన్నారు. 32 నుంచి 34 ఓటింగ్ శాతంలో ఉన్నామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మరో 5 శాతం ఓట్ల కోసం మా పోరాటం అన్నారు రేవంత్‌. అయితే.. కాంగ్రెస్‌ పార్టీలోని పెద్ద రెడ్లు సీఎం కేసీఆర్‌ కు అమ్ముడు పోయారని రేవంత్‌ చేసిన వాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఆ పెద్దరెడ్లు ఎవరు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అంటూ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read also: TS High Court: పోడు భూముల పట్టాల పంపిణీపై స్టేకు హైకోర్టు నిరాకరణ

కాగా రేవంత్‌ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర నిజామాబాద్ చేరుకుని ఇవాల్టితో మూడురోజుల నేపథ్యంలో.. రేవంత్‌ పాదయాత్ర క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో ముగించుకుని 11వ తేదీ నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చేరుకున్న విషయం తెలిసిందే.. ఇవాల (14న) ఉదయం 10 గంటలకు మంచిప్ప రిజర్వాయర్‌ను సందర్శిస్తారు రేవంత్‌. సాయంత్రం 4 గంటలకు మోపాల్ నుంచి కంజర్ – కులాస్‌పూర్ – ముల్లంగి – గణపూర్ మీదుగా పాదయాత్ర సాగనుంది. రాత్రి 7 గంటలకు డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌లో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నిజామాబాద్ నగరానికి చేరుకుంటారు. వారు అక్కడే ఉంటారు. ఇక రేపు (15)న తేదీ ఉదయం 9 గంటలకు కంఠేశ్వర శివాలయం, 10 గంటలకు దుబ్బాక భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం 11 గంటలకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. 12 గంటలకు మల్లారంలోని ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయకుండా విక్రయించిన స్థలాన్ని పరిశీలిస్తారు.

Read also: Warangal Crime: వైద్యం ముసుగులో క్షుద్రపూజలు.. హనుమకొండలో ఇద్దరు నకిలీ డాక్టర్స్ అరెస్ట్

సాయంత్రం 4.30 గంటలకు దుబ్బా చౌరస్తా – కెనాల్ కట్టా – నిర్మల హృదయ కాన్వెంట్ – నామ్‌దేవ్ వాడ – రావుజీ సంగం – సతీష్ పవార్ స్క్వేర్ – శివాజీ చౌక్ – రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ – దేవి రోడ్ – భగత్ సింగ్ స్క్వేర్ – జవహర్ రోడ్ – పూసల గల్లి – తుమ్మ బుచ్చయ్య క్రాస్ రోడ్ – గోల్ హనుమాన్ గోల్ హనుమాన్ . రెడ్డి టెంపుల్ – ఆర్యసమాజ్ – బడా బజార్ – ఆజం రోడ్ నుండి నెహ్రూ పార్క్ వరకు నడిచి, అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు బోధన్ నియోజకవర్గం సాతాపూర్ చేరుకుని బస చేస్తారు. ఎల్లండి త (16)వ తేదీ ఉదయం 9 గంటలకు సారంగాపూర్‌లోని ప్రాణహిత-చేవెళ్ల పంప్‌హౌస్‌ను సందర్శిస్తారు. ఉదయం 10 గంటలకు నవీపేట్ గ్రామంలోని మార్కండేయ ఆలయాన్ని సందర్శించిన అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అతను సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తాడు. ఎడపల్లి వివేకానంద విగ్రహం నుంచి బోధన్ అంబేద్కర్ కూడలి వరకు నడిచి, ఆపై కార్నర్ సమావేశంలో ప్రసంగించారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు ఆర్మూర్ నియోజకవర్గానికి చేరుకుని పెర్కిట్ హైవే పక్కన బస చేస్తారు. ఇక 17న ఉదయం 9 గంటలకు సిద్దుల గుట్ట ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు. పెర్కిట్‌ నుంచి మామిడిపల్లి – ఆర్మూర్‌ కొత్త బస్టాండ్‌ – అంబేద్కర్‌ చౌరస్తా – పాత బస్టాండ్‌, కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనను ముగించనున్నారు.
Budget Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jagga reddy
  • Komatireddy Rajagopal Reddy
  • Komatireddy Venkat Reddy
  • revanth reddy
  • Telangana Congress party

తాజావార్తలు

  • Monalisa: నా కూతురుపై ‘‘లవ్ జిహాద్’’, సీఎం గారు సాయం చేయండి.. మోనాలిసా తండ్రి కంటతడి..

  • Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్‌లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?

  • Kim jong un: ఓ వైపు ఇరాన్ యుద్ధం.. ఏకంగా 10 బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించిన కిమ్..

  • Minister Narayana: గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు.. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి..

  • Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!

ట్రెండింగ్‌

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions