Shad Nagar Cas: షాద్ నగర్ దళిత మహిళా కేసులో మరో ట్విస్ట్.. సునీత భర్త రౌడీషీటర్..?
- మేము దళితులమే మాకు ఎవరు న్యాయం చేస్తారు..?..
- 24 తులాల బంగారం- రెండు లక్షల నగదును సునిత చోరీ చేసింది..
- పెళ్లి కోసం దాచుకున్న సొత్తుంతా దోచేశారు..
- ఇప్పుడు పెళ్లి జరగకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం..
- సునీత భర్త రౌడీషీటర్ అని మీకు తెలియదా..?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shad Nagar Cas: మేము దళితులమే మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు.. ప్రతి పైసా కూడా పెట్టి పెళ్లి కోసమని దాచుకున్న 24 తులాల బంగారం రెండు లక్షల నగదు దోచుకుని సునీత నటిస్తుందని బాధితులు వాపోయారు. ఈరోజు మా దొంగతనం కేసును రాజకీయంగా మార్చి.. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నాయకులకు తండ్రి లేని పిల్లలం మా గోస కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ హరిజనవాడకు చెందిన బంగారం, నగదు దొంగతనం జరిగిన ఇంటి బాధితులు హుబ్బని నాగేందర్, అతని భార్య నీలవేణి, బాధితుడు నాగేందర్ కుటుంబ సభ్యులు, సోదరి రేణుక వాపోయారు. బాధితుడు నాగేందర్ కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఇంట్లో గత నెల 24వ తేదీన బంగారం చోరీ జరిగిందని చెప్పారు. తను కంది వనంలో ఓ ఆర్ ఎం పి వైద్యుడిగా పనిచేస్తున్నట్టు చెప్పారు తన భార్య నీలవేణి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుందని అదేవిధంగా తన సోదరి రేణుక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగా పని చేస్తున్నట్టు చెప్పారు.
Read also: We Hub: వీ హబ్ లో భారీ పెట్టుబడులు.. స్టార్టప్ లలో మరో రూ.839 కోట్లు..
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
పైసా పైసా కూడబెట్టి తన చెల్లి రేణుక పెళ్లి కోసం 24 తులాల బంగారం కూడబెట్టానని చెప్పారు. 24వ తేదీ తాము తమ ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారని చెప్పారు. పిల్లలు వచ్చేసరికి ఇంటి లోపల నుండి గడియ పెట్టి ఉందని పిల్లలు వెనుక భాగం నుండి వచ్చి చూడగా ఇంట్లో తలుపులు తెరిచి ఉన్నాయని బీరువా తలుపులు కూడా తెరిచి వస్తువులు చిందరవందరగా పడ్డాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఉద్యోగాల నుండి వచ్చిన తాము షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. డిటెక్టివ్ సిఐ రాంరెడ్డి తమ కేసు తీసుకున్నారని చెప్పారు. రౌడీ షీటర్ల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సునీత కుటుంబంలో నేర చరిత్ర గురించి కూడా ఒకసారి తెలుసుకోని మాట్లాడాలని కోరారు. సునీత కుటుంబంలో ఎవరెవరిపై కేసులు ఉన్నాయి? సునీత భర్త భీమయ్య స్థానిక పోలీస్ స్టేషన్లోనే రౌడీషీటర్ గా ఉన్న విషయం బీఆర్ఎస్ నాయకులకు తెలియదా అని వారు ప్రశ్నించారు.
Read also: Israel-Hamas war: ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి చేసే ఛాన్స్: అమెరికా
ఏం జరిగిందంటే..?
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తర్వాత పోలీసు బాధితురాలుగా చెప్పుకుంటున్న సునీత తమ ఇంటి ముందు గల్లీలో ఇంటి గడపపై కొన్ని బంగారు వస్తువులు పెట్టిందని ఇది తమ సోదరి రేణుక కళ్ళారా చూసిందని చెప్పారు. ఆ కవర్లో ఏముందని చూడగా తమకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపించాయని బాధితుడు నాగేందర్ చెప్పారు. అదేవిధంగా ఈ వస్తువులు నీకెలా వచ్చాయని సునీతను నిలదీయగా ఆమె కాలనీలో ఉన్న మల్లేశ్వరికి మిగతా సొమ్ములు ఇచ్చినట్టు చెప్పడంతో పోలీసులు సునితను, మల్లీశ్వరిని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారని చెప్పారు. ఆ తర్వాత అవే వస్తువులను మళ్లీ శ్రీరామ జ్యువెలర్స్ లో తాకట్టు పెట్టినట్టు చెప్పారని ఆ షాపుకు కూడా వెళ్లి చూశామని అక్కడ కూడా అబద్ధాలు చెప్పిందని చెప్పారు. ఆ తరువాత తిరుమలాపూర్లో ఉన్న సునీత సోదరుడుకు బంగారు వస్తువులు ఇచ్చినట్టు పోలీసులకు తప్పుడు సమాచారం సునీత పదేపదే ఇచ్చిందని చెప్పారు. ఇదే అనుమానంపై పోలీసులు సున్నితను ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని చెప్పారు. ఏళ్ల తరబడి కూడబెట్టిన డబ్బుతో పెళ్లి కోసం నగదు కొన్నామని తెలిపారు. ఈ ఆషాడం ముగియగానే పెళ్లి సంబంధం కుదిరిందని త్వరలోనే తమ ఇంట్లో వివాహం జరగబోతుందని ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని రేణుక ప్రశించింది.
Double Ismart: జెట్ స్పీడ్ లో డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!