Rajat Kumar: పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం, పర్ణశాల మునిగిపోతాయి.
Rajat Kumar Comments on polavaram project: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల వల్ల కడెం, కాళేశ్వరం కింద కొంత డ్యామేజ్ అయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కొంతమంది ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని.. 18 సంస్థలు చూసిన తర్వాత ఒకే చెప్పిన తర్వాత ప్రాజెక్టులు కడతారని ఆయన అన్నారు. కడెం, కాళేశ్వరం కింద జరిగిన పరిస్థితులపై కమిటీ విచారిస్తోందని అన్నారు. ఐఎండీ, యూరో శాటిలైట్ తో వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నామని అన్నారు. 100 ఏళ్ల తరువాత భారీగా వర్షాలు కురిశాయని ఆయన అన్నారు.
Read Also: Minister Harish Rao: సొంత ఇంటి స్థలం ఉంటే.. రూ.3 లక్షలు మంజూరు చేస్తాం
Also Read
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
పంప్ హౌజుల రిపేర్లకు రూ. 400 కోట్లు అవుతుందని అంటున్నారని.. పంప్ హౌజులను ప్రాజెక్ట్ కట్టిన సంస్థనే రిపేర్ చేస్తుందని.. పంప్ హౌజ్ రిపేర్ చేయడానికి రూ. 20-25 కోట్లకు మించి కావని.. సెప్టెంబర్ కల్లా పంప్ హౌజులు రెడీ అవుతాయని ఆయన అన్నారు. పంప్ హౌజ్ దగ్గర పవర్ రిస్టోర్ అయ్యిందని తెలిపారు. వందేళ్లలో కురవని వర్షం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని నాలుగు మండలాల్లో కురిసిందని ఆయన వెల్లడిమంచారు. కడెం ప్రాజెక్ట్ కు ఇటీవలే మరమ్మతులు చేశామని..ప్రమాదం ఏం లేదని వెల్లడించారు. వాతావరణ మార్పుల వల్లే భారీ వర్షం కురిసిందని.. క్లౌడ్ బరస్ట్ అనేది టెక్నికల్ పదం కాదని ఆయన అన్నారు.
కడెం ప్రాజెక్టు సమీపంలో అతి భారీ వర్షం పడింది.. వరదలు, వర్షాలపై సంసిద్ధంగా లేదనడం సరికాదని అన్నారు. పోలవరం వల్ల లక్ష ఎకరాలు మునిగిపోతాయని.. బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం, పర్ణశాల ముగినిపోవడంతో పాటు.. చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో స్టడీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోొసార్లు నివేదికలు పంపామని వెల్లడించారు. బ్యాక్ వాటర్ నష్టం వల్ల, ఇతరత్రా అంశాలపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదని తెలిపారు.
తాజావార్తలు
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
-
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
-
Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!