Raja Singh: పద్నాలుగు నెలలు బీజేపీకి దూరంగా ఉన్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh: పద్నాలుగు నెలలు బీజేపీ పార్టీకి దూరంగా ఉన్నానని గోషామాల్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో మహాశక్తి దేవాలయాన్ని రాజాసింగ్, బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునావర్ తో కేటిఆర్ హైదరాబాద్ కి తీసుకువస్తే అడ్డుకున్నానని స్పష్టం చేశారు. నా సస్పెన్షన్ ఎత్తివేసినందుకు పార్టీ కి ధన్యవాదాలన్నారు. మహలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని కేసీఆర్ ఫ్యామిలి తరిమెయ్యాలని సంకల్పం తీసుకున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ర్ తెలంగాణ ప్రజలని మోసం చేసారని మండిపడ్డారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ చేయలేని బంగారు తెలంగాణ మేము తీసుకువస్తామన్నారు. కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా బండి సంజయ్ గెలిపించాలన్నారు.
దాదాపు ఏడాది తరువాత నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సస్పెషన్ ఎత్తేసి, సీటు కేటాయించడంతో రాజాసింగ్ భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు.రాజాసింగ్ మాట్లాడుతూ.. దమ్ముంటే నా మీద అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయాలన్నారు. ఎంఐఎంను పెంచి పోషించింది కాంగ్రెస్ అని ఆయన ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్లు ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘నా నియోజక వర్గం లో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన సపోర్ట్ చేస్తా అని చెప్పిన విక్రమ్ గౌడ్ నాకు ప్రచారం చేస్తారు. నాకు హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. నా పైన సస్పెన్షన్ ఎత్తేవేసి నాకు టికెట్ ఇచ్చినందుకు బీజేపీ హై కమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు రాజాసింగ్. పార్టీ ఎక్కడ ప్రచారం చేయమన్న చేస్తానని అన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ గ్రాఫ్ తగ్గిందనే ది ప్రచారం మాత్రమే’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవడంపై రాజాసింగ్ ఆనందం వ్యక్తం చేశారు.
Central Team: కాళేశ్వరం డ్యామ్ భద్రతపై కిషన్ రెడ్డి లేఖ.. రేపు తెలంగాణకు కేంద్ర బృందం..
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!