Rajanna Sircilla: బరితెగించిన కాంట్రాక్టర్.. కొడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని తీసుకెళ్లి నిర్బంధం..
- కొడుకు పైసలు ఇయ్యలేదని తల్లిని తీసుకెళ్లిన కాంట్రాక్టర్..
- కొద్దిరోజులగా మహారాష్ట్ర కాంట్రాక్టర్- కొడుముంజ మేస్త్రీకి మధ్య డబ్బుల పంచాయితీ..
- మేస్త్రీ ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగిన మహారాష్ట్ర వ్యక్తులు..
- అనారోగ్యంతో ఉన్న తల్లిని బలవంతంగా తమతో తీసుకెళ్లిన వైనం..
- కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు..
Rajanna Sircilla: తీసుకున్న డబ్బులివ్వడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. ఏకంగా మేస్త్రీ తల్లిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అమానవీయ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్య క్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామానికి చెందిన పల్లపు శ్రీను అనే వ్యక్తి బండ పని మేస్త్రీగా పనిచే స్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన లాలు దేవకర్ అండ్ టీం కర్ణాటకలో చెరుకు తోటలను కోసే పనులను కాంట్రాక్టు తీసుకున్నారు. ఇందుకోసం కూలీలు అవసరం ఉండగా.. శ్రీను. అతడి సోద రుడిని సంప్రదించారు. ప్రస్తుతం శ్రీను, అతని సోదరుడు చత్తీస్ గఢ్ లో కూలీ పనులు చేస్తున్నారు. అయితే లాలు దేవకర్ కు సంబంధించి కర్ణాటకలోని చెరుకు తోట కొట్టడానికి కావాల్సిన లేబర్ లను పురమాయించేందుకు చత్తీస్ గఢ్ కు చెందిన కూలీలతో శ్రీను ఒప్పందం కుదిర్చాడు. దీనికి మధ్య వర్తిత్వంగా శ్రీను వ్యవహరించాడు. ఇందుకోసం లాలు దేవకర్ రూ.3.80 లక్షలను కూలీలకు చెల్లించాడు.
Read also: Mallu Bhatti Vikramarka: మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నాం..
Also Read
కానీ కూలీలు పనులకు రాకపోవడంతో లాలు దేవకర్ కు, కొడుముంజకు చెందిన శ్రీను, అతడి సోదరునికి మధ్య వివాదం చోటుచేసుకుంది. తన డబ్బులు తిరిగి చెల్లించాల ని లాలు దేవకర్ శ్రీను అతడి సోదరుడిపై ఒత్తిడి చేశాడు. ఈ విషయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం లాలు దేవకర్, మరికొంత మంది కొడుముంజ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని శ్రీను ఇంటికి వచ్చారు. శ్రీను.. అతడి సోదరుడు ఇంటి వద్ద లేకపోవడంతో డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో ఉన్న శ్రీను తల్లి అయిన పల్లపు భీమా బాయ్ ను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ కు పాల్పడ్డారు. డబ్బులిచ్చి తల్లిని తీసుకెళ్లాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనారోగ్యంతో ఉన్న భీమా బాయ్ ను ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా లాలు దేవకర్ అతని అనుచరు లు దౌర్జన్యంగా భీమా బాయ్ ను ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ సీఐ వీర ప్రసాద్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. పల్లపు భీమా బాయ్ ను ఎత్తుకెళ్లిన వారు మహారాష్ట్ర వెళ్లినట్లు సమాచారం సేకరించి పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
Khammam: ఖమ్మంలో ఘరానా మోసం.. ఏటీఎం నగదు బదిలీలో ఆరితేరిన ఆ ముగ్గురు..
తాజావార్తలు
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
-
Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో