Mallu Bhatti Vikramarka: మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నాం..
- రావుస్ అకాడమీ ఫర్ కాంపిటీటివ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
- తెలంగాణ ప్రాంతంవారు సివిల్స్ సాధించేలా రావుస్ అకాడమీ ఉపయోగపడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: గత పదేళల్లో రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయాం అని..మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నామన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో రావుస్ అకాడమీ ఫర్ కాంపిటీటివ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంవారు సివిల్స్ సాధించేలా రావుస్ అకాడమీ ఉపయోగపడుతుందన్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు యూపీఎస్సీ కి సెలెక్ట్ అయ్యేవారు ఎక్కువగా ఉండేవారన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో మూడో ప్లేస్ లో ఉండేవారు ఇప్పుడు ఎక్కడో ఉన్నారని తెలిపారు. మన రాష్ట్రంలో చదివే వాళ్లు ఎక్కువగానే ఉన్న ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసే వారు లేరన్నారు. గతంలో తెలుగు వాళ్లు సివిల్స్ సర్వీసెస్ లో అధికంగా ఉండి దేశంలో విధానపరమైన నిర్ణయాల్లో కీలకంగా ఉండేవారన్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
మన దగ్గర నుంచి సివిల్ సర్వెంట్స్ అధికంగా ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్ సాధించాలనే విద్యార్థులను ఎంకరేజ్ చేస్తుందని అన్నారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి మా ఎనర్జీ శాఖ నుంచి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి లక్ష రూపాయలు ఇచ్చామన్నారు. మెయిన్స్ పాస్ అయి ఇంటర్వ్యూకీ వెళ్లే వారికి కూడా లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మన ప్రాంతం విద్యార్థులు దేశ వ్యాప్తంగా విధానపరమైన నిర్ణయాల్లో కీలకం కావాలన్నారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం.. అందుకే పోరాటం చేశాం.. పోరాటం నుంచి వచ్చిందే మన రాష్ట్రం అని తెలిపారు. గత పదేళల్లో రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయాం అని తెలిపారు. మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసాం.. పేపర్ లీక్ వంటివి మా ప్రభుత్వంలో లేవని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మేము పని చేస్తున్నామని అన్నారు.
Khammam: ఖమ్మంలో ఘరానా మోసం.. ఏటీఎం నగదు బదిలీలో ఆరితేరిన ఆ ముగ్గురు..
తాజావార్తలు
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!