Rajanna Sircilla: ఊపిరి ఉండగానే స్మశానంలో పడేశారు.. చివరకు ఏమైందంటే..
- శ్మశాన వాటికలో ప్రాణాలతో ఉన్న వృద్ధురాలు..
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: ప్రాణాలతో ఉన్న వృద్ధురాలిని శ్మశాన వాటికలో వదిలేసిన హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలంగా మారింది. శ్మశానవాటిక నుంచి మూలుగుతూ శబ్దాలు రావడంతో అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు వెళ్లి చూడగా ఓ వృద్ధురాలు కనిపించింది. దీంతో వారు షాక్కు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read also: Cyclone Dana: దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రోజు ఈ రైళ్లు రద్దు..
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కూకట్ల రాజవ్వ(60) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. వారికి పిల్లలు లేరు. పద్మానగర్ గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. కొద్దిరోజుల క్రితం కిడ్నీ ఫెయిల్ కావడంతో తంగళ్లపల్లిలోని తన సోదరుడి కుమారుడి తిరుపతి (అల్లుడు) ఇంటికి వెళ్లింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిసి బస్వాపూర్, మండేపల్లికి చెందిన రాజవ్వ అక్కచెల్లెళ్లు భూమవ్వ, ఎల్లవ్వ ఆమెను చూసేందుకు తంగళ్లపల్లికి వచ్చారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో రాజవ్వను సోమవారం తంగళ్లపల్లిలోని తిరుపతి ఇంటికి తీసుకెళ్లారు.
Read also: SSRMB 29 : మహేశ్ కోసం రాజమౌళి వేట మొదలైంది..
మీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి మళ్లీ ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారని తిరుపతి అడగడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రాజవ్వను నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లి సోమవారం రాత్రంతా అక్కడే బస చేశారు. శ్మసాన వాటిక నుంచి మూలుగుతున్న శబ్దాలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా షాక్ తిన్నారు. బతికున్న రాజవ్వను అక్కడే పడుకోబెట్టి ఉండటాన్ని చూసి చలించిపోయారు. ఏం జరగిందని అడగటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం తహసీల్దార్ జయంత్కుమార్, ఎస్సై రామ్మోహన్ స్పందించి సిబ్బందిని పంపించి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేసి వృద్ధురాలిని తిరుపతి ఇంటికి తరలించారు.
KTR Testimony: మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం..
తాజావార్తలు
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!