Rajanna Sircilla: ఊపిరి ఉండగానే స్మశానంలో పడేశారు.. చివరకు ఏమైందంటే..
- శ్మశాన వాటికలో ప్రాణాలతో ఉన్న వృద్ధురాలు..
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: ప్రాణాలతో ఉన్న వృద్ధురాలిని శ్మశాన వాటికలో వదిలేసిన హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలంగా మారింది. శ్మశానవాటిక నుంచి మూలుగుతూ శబ్దాలు రావడంతో అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు వెళ్లి చూడగా ఓ వృద్ధురాలు కనిపించింది. దీంతో వారు షాక్కు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read also: Cyclone Dana: దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రోజు ఈ రైళ్లు రద్దు..
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కూకట్ల రాజవ్వ(60) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. వారికి పిల్లలు లేరు. పద్మానగర్ గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. కొద్దిరోజుల క్రితం కిడ్నీ ఫెయిల్ కావడంతో తంగళ్లపల్లిలోని తన సోదరుడి కుమారుడి తిరుపతి (అల్లుడు) ఇంటికి వెళ్లింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిసి బస్వాపూర్, మండేపల్లికి చెందిన రాజవ్వ అక్కచెల్లెళ్లు భూమవ్వ, ఎల్లవ్వ ఆమెను చూసేందుకు తంగళ్లపల్లికి వచ్చారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో రాజవ్వను సోమవారం తంగళ్లపల్లిలోని తిరుపతి ఇంటికి తీసుకెళ్లారు.
Read also: SSRMB 29 : మహేశ్ కోసం రాజమౌళి వేట మొదలైంది..
మీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి మళ్లీ ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారని తిరుపతి అడగడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రాజవ్వను నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లి సోమవారం రాత్రంతా అక్కడే బస చేశారు. శ్మసాన వాటిక నుంచి మూలుగుతున్న శబ్దాలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా షాక్ తిన్నారు. బతికున్న రాజవ్వను అక్కడే పడుకోబెట్టి ఉండటాన్ని చూసి చలించిపోయారు. ఏం జరగిందని అడగటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం తహసీల్దార్ జయంత్కుమార్, ఎస్సై రామ్మోహన్ స్పందించి సిబ్బందిని పంపించి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేసి వృద్ధురాలిని తిరుపతి ఇంటికి తరలించారు.
KTR Testimony: మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం..
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!