Rajanna Sircilla: జాతరలో కుక్క స్వైరవిహారం.. 21 మందిపై దాడి..
- సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని వేణుగోపాల స్వామి జాతరలో 21 మందిని కరిచిన కుక్క..
- జాతరకు వచ్చిన పిల్లలను, వృద్ధులను, మహిళలను ఏక కాలంలో కర్చిన పిచ్చి కుక్క..
- ఓ మహిళ ఇంట్లో పనులు చేస్తుండగా చొరబడి దాడిచేసి చేతిపై కరిచిన కుక్క..
- హుటాహుటిన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు..
- ఒకే సారి 21 మందిని కుక్క కరవడంతో ఆసుపత్రిలో అందుబాటులోలేని యాంటి రేబిస్ వ్యాక్సిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: జాతరకు వచ్చిన 21 మంది భక్తులపై కుక్క దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతుంది. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి జాతరలో 21 మందిని కుక్క కరవడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. జాతరకు వచ్చిన పిల్లలను, వృద్ధులను, మహిళలను ఏక కాలంలో పిచ్చి కుక్క కరిచింది దీంతో జాతరకు వచ్చే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ ఇంట్లో పనులు చేస్తుండగా చొరబడి దాడిచేసి చేతిని గాయపరిచింది. ఆమెను హుటాహుటిన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఒకేసారి 21 మందిని కుక్క కరవడంతో ఆసుపత్రిలో యాంటి రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. అరగంట తర్వాత వైద్యులు యాంటి రేబిస్ వ్యాక్సిన్ సమకూర్చారు. కుక్క స్వైరవిహారం చేయడంతో మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కల బారినుండి కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. గాయంతో ఆసుపత్రికి వస్తే.. యాంటి రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Fire Accident: పుప్పాల్ గూడ లో భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్మెంట్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్..
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!