Sangareddy Land Issue: బతికే ఉన్న మహిళను చనిపోయినట్టు చిత్రీకరించి.. 27 ఎకరాలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raikode MRO Rajaiah Changed Land Details Of Old Lady In Dharani Portal: సంగారెడ్డిలోని రాయికోడ్ ఎమ్మార్వో రాజయ్య నిర్వాకం బట్టబయలైంది. బతికే ఉన్న మహిళను చనిపోయినట్టుగా చిత్రీకరించి.. 27 ఎకరాల్ని కొట్టేయాలని పక్కా స్కెచ్ వేశాడు. ధరణి పోర్టల్లో పట్టాదారు చనిపోయారని మెన్షన్ చేసి, ఆమె భూమిని మరొకరి పేరుపై బదలాయించాడు. అంతేకాదు.. సర్వే నంబర్ని సైతం ఎవరూ చూడకుండా ప్రైవసిలో పెట్టాడు. చివరికి ధరణి పోర్టల్లో చెక్ చేయగా.. ఆ ఎమ్మార్వో అడ్డంగా బుక్కయ్యాడు.
నాగన్పల్లిలో 198 సర్వే నెంబర్లో హనుమంత్ రెడ్డికి 27 ఎకరాల భూమి ఉంది. ఆయన 2021 ఏప్రిల్లో కరోనాతో చనిపోయాడు. దీంతో.. ఈ ఏడాది ఏప్రిల్లో తన భర్త మీదున్న ఆ భూమిని తన పేరుపై మార్చుకుంది భార్య శివమ్మ. అయితే.. ఆ భూమిపై కన్నేసిన ఎమ్మార్వో రాజయ్య, ఈనెల 19వ తేదీన బతికున్న శివమ్మని మృతి చెందినట్టుగా చిత్రీకరించి, ధరణి పోర్టల్లో మరొకరి పేరు మీద వివరాలన్నీ మార్చేశాడు. ఈ రోజు ధరణి పోర్టల్లో తన భూమి వివరాలు పరిశీలిస్తుండగా.. తన పేరుపై ఉండాల్సిన భూమి, మరొకరి పేరు మీద ఉండటాన్ని శివమ్మ గమనించింది. అంతేకాదు.. అందులో తాను చనిపోయినట్టుగానూ ఉండటం చూసి ఖంగుతింది.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
దాంతో.. శివమ్మ వెంటనే కలెక్టర్కి ఫిర్యాదు చేసింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించగా.. కలెక్టర్ ఆదేశాలతో రాయికోడ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ భూమి విలువ రూ. 27 కోట్లు ఉంటుందని శివమ్మ పేర్కొంది. నాగన్పల్లిలో ఈ భూమి ఉందని, గతేడాది తన భర్త చనిపోవడంతో తన పేరు మీద పట్టా చేసుకున్నానని వాపోయింది. తనకు పాస్ బుక్ కూడా వచ్చిందని.. ఇప్పుడు తాను చనిపోయినట్టు చిత్రీకరించి, ఆ భూమిని వేరే వాళ్ల పేరు మీద పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!