MLC Kavitha : ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురింపించిన ఎమ్మెల్సీ కవిత
- రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
- ఆరు గ్యారంటీల విఫలం.. ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్
- రేవంత్ రెడ్డి పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలపై రాహుల్ మౌనంగా ఎందుకు : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. “ఎన్నికల సమయంలోనే కనిపించే గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. ఆయనను స్వాగతించాల్సిందే… ఎందుకంటే మళ్లీ కనిపించేది ఎన్నికలపూటే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కవిత తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితంగా నిలిచాయని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఏ ఒక్క హామీను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పిన వాగ్దానం కేవలం అర్థాంతరంగా నిలిచిందని, మహిళలకు తులం బంగారం, నెలకు రూ.2500 ఇస్తామన్న హామీలు కనిపించకుండా పోయాయని కవిత ఆరోపించారు.
అంతేకాదు, రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఇటీవల హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన లాఠీ దాడులను, లగచర్లలో బంజారా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను గుర్తుచేస్తూ, ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన వైఫల్యాలకు నిదర్శనాలని ఆమె పేర్కొన్నారు. ఈ దాడులన్నింటిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించిందని గుర్తు చేశారు. సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో “కరెంట్ లేదు” అని పోస్ట్ చేస్తే వారిపై కేసులు పెడుతున్న పరిస్థితిలో, తెలంగాణ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని కవిత తెలిపారు. గ్రూప్-1 పరీక్షల ఆలస్యంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నా, కాంగ్రెస్ నాయకత్వం మౌనంగా ఉండటం దారుణమని విమర్శించారు.
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
“రాహుల్ గాంధీ ఎర్ర బుక్ పట్టుకుని దేశమంతా తిరుగుతారు, కానీ తెలంగాణలో రాజ్యాంగ విలువలు తుడిచిపెట్టే చర్యలపై మాత్రం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేలా ఉంది,” అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి తీవ్రంగా సవాల్ విసిరిన కవిత, తెలంగాణ ప్రజలు నిజాన్ని తెలుసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చబోతున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!