Raghunandan Rao: మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ సర్కార్ దాడి చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao Talks About ITIR Project: కేసీఆర్ సర్కార్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విరుచుకుపడ్డారు. ITIR ప్రాజెక్ట్ను ఇవ్వడం లేదని.. మోడీ ప్రభుత్వంపై తెలంగాణ సర్కార్ దాడి చేస్తోందని ఆరోపణలు చేశారు. ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అంటే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఐటీ కోసం అభివృద్ధి చేయడమని.. 2008లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు అది మంజూరు చేసిందని తెలిపారు. 202 చదరపు కిలోమీటర్ల స్థలంలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 2013 నుండి 2018 వరకు, అలాగే 2018 నుండి 2038 వరకు.. రెండు విడతల్లో అభివృద్ధి చేయాలని ప్లాన్ వేశారని చెప్పారు. ఇందుకు 4 వేల 863 కోట్లు సహకారం ప్రకటించిన కేంద్రం.. ఆ మొత్తంలో 3 వేల 275 కోట్లు మంజూరు చేసిందని తెలియజేశారు.
Naveen Reddy Atluri: సినీ హీరో నవీన్ రెడ్డి అరెస్ట్.. నమ్మించి నట్టేట ముంచాడు
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
ఈ ITIRపై మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయలేదన్న ఆయన.. రైల్వే లైన్కీ సహకారం అందించలేదని ఆరోపించారు. మెట్రో సైతం వేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో సంబందం లేని అమెజాన్కి లాండ్ కేటాయించినా.. కేంద్రం అభ్యంతరం తెలపలేదన్నారు. నగర అభివృద్ధికి కేంద్రం రూ.400 కోట్లు ఇచ్చిందని.. అయినా కేంద్రం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని బురద చల్లడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ITIRకి కేంద్రం ఇచ్చేదాని కన్నా ఎక్కువ నిధుల్ని మంజూరు చేసిందన్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం DPRలు సబ్మిట్ చేయలేదని.. ఫేస్ 1ను సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనందుకే కేంద్రం ITIRను రద్దు చేసిందని ఆయన వివరించారు.
Shehbaz Sharif: భారత్కి పాక్ ప్రధాని బెదిరింపు.. పాదాల కింద నలిపేస్తాడట!
అంతకుముందు.. సిరిసిల్ల, సిద్దిపేటలో తన పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానంటూ రఘునందనరావు ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే దుబ్బాకకు రావాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ బీహార్కు సంబంధించిన వ్యక్తేమోనన్న అనుమానం వస్తోందని.. బీహార్ అధికారులనే తెలంగాణ సీఎస్, డీజీపీగా నియమించారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న వారిని రబ్బరు బుల్లెట్లతో కాల్చారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ బీహార్ వ్యక్తి అని ఆంధ్రా వాళ్లు అంటే తాము కాదన్నామని, కానీ ఇప్పుడు తమకే అనుమానాలు వస్తున్నాయన్నారు. ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!