సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్లను ఎదుర్కొన్నాను: పీవీ సింధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్ లను తానూ ఎదుర్కొన్నానని పీవీ సింధు అన్నారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘మహిళలు, పిల్లలకు సైబర్ వరల్డ్ పై చైతన్య కార్యక్రమం’ అనే అంశంపై శనివారం రాష్ట్రంలోని వివిధ పాఠశాలలోని సైబర్ అంబాసిడర్లకు ప్రత్యేక చైతన్య కార్యక్రమమం నిర్వహించారు. ఈ చైతన్య కార్యక్రమానికి ప్రముఖ షెట్లర్ పీ.వీ సింధు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతీ లక్రా, ఐ.జీ. బి.సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడారు. సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్లను ధైర్యంగా ఎదుర్కోవడం తోపాటు వీటిపై పోలీస్ శాఖలోని సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా షీ -టీమ్ లు మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక భరోసాగా మారాయని పీ.వీ. సింధు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఉన్న కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన ఇంటర్నెట్ వినియోగంతో సైబర్ నేరాలు కూడా భారీగా పెరిగాయని సింధు అభిప్రాయపడ్డారు. ఈ నేరాలు ప్రధానంగా మహిళలు, పిల్లల కేంద్రీకృతంగా అధికమవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు షీ-టీమ్లున్నాయనే భరోసాను ఎలాగైతే కల్పించాయో, సైబర్ మోసాలకు గురైతే, వెంటనే తమకు సైబర్ వారియర్లు ఉన్నారనే ధైర్యాన్ని కల్పించాలని సింధు పేర్కొన్నారు.
సైబర్ నేరాల బారిన పడితే, వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిరంతర శ్రమ, అభ్యాసం ద్వారానే చాంఫియన్ అవుతారన్నారు. ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు ఏదో ఒక వ్యాయామం చేయాలని సూచించారు. తమ పిల్లలను తల్లి, తండ్రులు నిరంతరం గమనిస్తుండాలన్నారు. ఏవైనా సమస్యలను పిల్లలు ఎదుర్కొంటే వాటిని అర్థం చేసుకుని అధిగమించే చైతన్యాన్ని కల్పించాలని సింధు తెలిపారు. ఇంటర్నెట్ వినియోగం నిత్యజీవితంలో ఒక భాగమైపోయిందన్నారు. వీటిలో విద్యాపరమైన, స్ఫూర్తిదాయక, క్రీడా కార్యక్రమాలతోపాటు మానసిక వికాస కార్యక్రమాలను చూడడానికి ప్రాధాన్యతను ఇచ్చే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Also Read
- CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
కోవిడ్ నేపథ్యంలో మొబైల్ వాడకం పెరిగింది: స్వాతి లక్రా, అడిషనల్ డీజీ
అనంతరం అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ, ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో పెరిగిన మొబైల్ వాడకం ద్వారా సైబర్ నేరాలు కూడా పెరిగాయని అన్నారు. ఈ సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి రాష్ట్రం లోని ప్రతీ పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థినులు, ఒక మహిళా ఉపాధ్యాయినికి సైబర్ నేరాలను ఎదుర్కోనేందుకు సైబర్ కాంగ్రెస్ అనే పేరుతొ ప్రత్యేక శిక్షణ ఇప్పించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు రెండు వేల మంది మహిళా ఉపాధ్యాయులకు, 3500 విద్యార్థినులకు ఈ శిక్షణ ఇప్పించామని స్వాతి లక్రా వెల్లడించారు.
తాజావార్తలు
-
Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
-
CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
-
RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
-
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
-
IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!