Pregnant Woman: పురిటి నొప్పులతో నిండు గర్భిణి.. టైరు సాయంతో వాగు దాటించిన స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnant Woman: నిండు గర్భిణి.. పురుటినొప్పితో బాధపడుతోంది. ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు లేదు. అమె వైద్యం చేయించేకోవాలంటే ప్రవాహాన్ని దాటాలి. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రవాహాన్ని దాటడం ప్రమాదకరం. ఈ స్థితిలో కుటుంబ సభ్యులు నరకం చూశారు. ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లాలో తెలియక… మనోవేదనకు గురయ్యాడు. ఈతగాళ్లు… స్థానికుల సాయంతో… అతి కష్టం మీద వాగు దాటేందుకు ప్రయత్నించారు. గర్భిణిని టైరుపై కూర్చోబెట్టి మెల్లగా వాగు దాటారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని మారుమూల గ్రామం. ఈ ఊరికి రవాణా సౌకర్యం సరిగా లేదు. ఎందుకంటే జంపన్న నది అడ్డంగా ఉంది. ఊరు దాటాలంటే జంపన్న వాగు దాటాలి. మామూలు రోజుల్లో పర్వాలేదు.. ఎలాగోలా గడిచిపోతుంటాయి. అయితే వర్షం కురిసినా.. వాగు పొంగిపొర్లినా.. ఇక ఆ గ్రామస్తులకు నరకం మొదలవుతుంది. వాగు పొంగిపొర్లితే… ఎలిశెట్టిపెల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఆ సమయంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఊరు దాటే మార్గం లేదు. ప్రాణాలను పణంగా పెట్టి నదిని దాటాలి. గర్భిణులు, వృద్ధులు… ఆ సమయంలో నరకం చూస్తున్నారు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా ఇబ్బందులు పడుతున్నారు. పొంగిపొర్లుతున్న నదిని దాటలేక… వారి బాధలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు.. ఈ గర్భిణికి ఎదురైన కష్టాలు కూడా అలాగే ఉన్నాయి. ఆమె పేరు దబ్బగట్ల సునీత. ఆమెకు నెలలు నిండటంతో పురిటినొప్పులు మొదలయ్యాయి.
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే… రోడ్డు లేదు. జంపన్న నది పొంగిపొర్లుతోంది. ఏం చేయాలో తోచక… గజ ఈతగాళ్లు, స్థానికులు ఆమెకు సాయం చేశారు. వారు ఆమెను టైరుపై కూర్చోబెట్టి ప్రవాహాన్ని దాటారు. గర్భిణిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ మహిళ ఆస్పత్రికి చేరే వరకు నరకం చూసింది. గర్భిణీ.. టైరుపై కూర్చొని వాగు దాటడం అంత సులువు కాదు. వాగు దాటుతున్నప్పుడు ఆమె పడే వేదన వర్ణనాతీతం. వంతెన కావాలని ఎలిశెట్టి పెల్లి గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర సమయంలో గ్రామం దాటాలంటే… తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తమ గ్రామానికి వంతెన మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. కానీ… ఇప్పటి వరకు పాలకులు స్పందించకపోవడంతో… వారి కష్టాలు అలాగే ఉన్నాయి. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి వంతెన మంజూరు చేయాలని ఎలిశెట్టి పెళ్లీడు గ్రామస్తులు కోరుతున్నారు.
Foods for Kids: పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తినిపించండి..!
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!