పాకిస్తాన్లో చిక్కిన తెలుగు యువకుడు హైదరాబాద్వాసి ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు. 2017 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ నుంచి మిస్సైన ప్రశాంత్ నాలుగేళ్లగా పాకిస్తాన్లో అడుగుపెట్టి బందీగా మారాడు. కాగా ప్రశాంత్ నేడు హైదరాబాద్ చేరుకోనున్నాడు. హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తున్న ప్రశాంత్.. సీజర్ లాండ్ లో తన ప్రియురాలిని కలవడానికి వస్తున్న క్రమంలో ప్రశాంత్ పాక్ కు చిక్కాడు. కాగా, వాఘా సరిహద్దులో ప్రశాంత్ ను భారత్ కు అప్పజెప్పారు పాక్ అధికారులు. ప్రశాంత్ ఇంటికి చేరుకోవడంతో ప్రశాంత్ కుటుంబం ఆనందంలో మునిగారు. 2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను ప్రశాంత్ తండ్రి బాబురావు కలిశారు.
పాకిస్తాన్లో చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదల
