పట్ట పగలే కత్తులు, బ్యాట్ లతో సినీ నటి రమ్య శ్రీ, ఆమె సోదరుడిపై దాడి చేశారు కొంతమంది దండగులు. ఈ రోజు హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టింది హైడ్రా. ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్టు సమాచారం.
పాకిస్తాన్లో చిక్కిన తెలుగు యువకుడు హైదరాబాద్వాసి ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు. 2017 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ నుంచి మిస్సైన ప్రశాంత్ నాలుగేళ్లగా పాకిస్తాన్లో అడుగుపెట్టి బందీగా మారాడు. కాగా ప్రశాంత్ నేడు హైదరాబాద్ చేరుకోనున్నాడు. హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తున్న ప్రశాంత్.. సీజర్ లాండ్ లో తన ప్రియురాలిని కలవడానికి వస్తున్న క్రమంలో ప్రశాంత్ పాక్ కు చిక్కాడు. కాగా, వాఘా సరిహద్దులో ప్రశాంత్ ను భారత్…