Ponnam Prabhakar: ఆ పార్టీలో అవమానం భరించలేక కాంగ్రెస్ లోకి.. పొన్నం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిని సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందన్నారు.
Read also: MLC Kavitha: ఆతల్లి ఏపీ రాష్ట్రానికి అండగా ఉంటుంది.. కోనసీమలో కవిత పర్యటన
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి హస్తం పార్టీలో చేరారు. తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అధినేత కేసీఆర్కు రాజీనామా లేఖ పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ తెలంగాణ ట్రేడర్స్ సెల్ అధ్యక్ష పదవికి కూడా శోభన్రెడ్డి రాజీనామా చేశారు. టీఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. తార్నాకలో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది తామేనని అన్నారు. అప్పటి నుంచి తెలంగాణవాదులుగా కొనసాగుతూ రాష్ట్రం ఏర్పడ్డాక తమకు గుర్తింపు వస్తుందని భావించి 2020లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలలోగా మేయర్ పదవిని కోరితే కేసీఆర్కు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించారు. ఆ తర్వాత భర్త శోభన్రెడ్డికి ఉప్పల్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరగా.. కేటాయించలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
KTR: అంత్యక్రియలకు రాలేకపోయా.. లాస్య కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!