Ponguleti, Jupalli: కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి!.. ఈ నెల 20 లేదా 25న ఖమ్మం సభలో చేరిక
Ponguleti, Jupalli: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వారిని తమ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సుముఖతతో ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ముగించుకొని ఢిల్లీ రాగానే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలతో కలిసి.. ఈ అంశంపై చర్చించి పొంగులేటి, జూపల్లిని అధికారికంగా కాంగ్రెస్లో చేర్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభతో కాంగ్రెస్లో చేరాలనే ఆలోచనలో వారు ఉన్నట్టు సమాచారం.
Read also: Sharad Pawar: కొత్త పార్లమెంట్ నిర్మించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు..
Also Read
- Kavitha: కవిత 'TRS' పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
- Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
- Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
- Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్లో చేరికకు ఆపార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ చర్చలు జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆ ఇద్దరు నేతలు తమ అభిమానులు, కార్యకర్తలకు ఇప్పటికే అటువంటి సంకేతాలిచ్చారు. ఈనెల 12న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం ఈనెల 20వ తేదీ లేదా 25వ తేదిన ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్లో కలవాలని నిర్ణయించినట్టు సమాచారం. రాహుల్ అమెరికా పర్యటన తర్వాత ఖమ్మం సభపై నిర్ణయం తీసుకోనున్నారు.
Read also: Ileana : బికినిలో బేబీ బంమ్స్ తో ఇలియానా హాట్ ట్రీట్..
పొంగులేటి, జూపల్లికి కాంగ్రెస్ పలు కీలక హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిద్దరికి టికెట్లు ఫిక్స్ చేయడంతో పాటు అనుచరులకు కూడా టికెట్లలో ప్రాధాన్యత ఇస్తామని హామీ లభించినట్లు సమాచారం. అలాగే తమతో పాటు ఇతర పార్టీల నుంచి పలువురు కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతలను వారిద్దరు తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. దీంతో ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న పలువురు కీలక నేతలను తమతో తీసుకొచ్చేందుకు వారిద్దరు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేతల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
-
Kavitha: కవిత ‘TRS’ పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
-
Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!