Police Recruitment Aspirants: పండగ వేళ పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా పండుగ వేళ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అభ్యర్ధులకు శుభవార్త అందించింది. కటాఫ్ మార్కులు తగ్గిస్తూ జీవో విడుదల చేసింది. పోలీసు ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కటాఫ్ మార్కులను తగ్గిస్తూ జీవో విడుదల చేసింది. ఇటీవల జరిగిన పోలీస్ నియామక పరీక్షల్లో అన్ని కేటగిరీల అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలో 60 మార్కులు కేటాయించడంపై తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తగా.. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. పోలీసుల అర్హత పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని వెల్లడించారు. అయితే.. ఈ వెసులుబాటు కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. నేడు తెలంగాణ పోలీస్ నియామక మండలి దీనిపై నిర్ణయం తీసుకుంది. కటాఫ్ మార్కులను సవరిస్తూ జీవో జారీ చేసింది.
సవరించిన జీవో ప్రకారం.. ఓసీ అభ్యర్థులకు 30 శాతం, బీసీ అభ్యర్థులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 20 శాతం మార్కులను కేటాయిస్తున్నట్లు అధికారిక వెబ్సైట్లో అధికారులు నోటీస్ జారీ చేశారు. దీని ప్రకారం.. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 60 మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 40 మార్కులు వస్తే.. ఉత్తీర్ణులవుతారు. తర్వాత నిర్వహించబోయే.. శారీరధారుడ్య పరీక్షలకు అర్హత పొందుతారన్నమాట.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
Read Also: Ys Sharmila: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ మీకేం చేసారు?
గతంలో జరిగిన పోలీసు నియామక పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు 30 శాతంగా.. బీసీలకు 35 శాతంగా.. ఓసీలకు 40 శాతంగా ఉండేవి. కానీ.. ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30 శాతం మార్కులనే అర్హతగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పరీక్షలో 200 ప్రశ్నలకు గానూ… 60 మార్కులు వస్తే సరిపోతుంది. మళ్లీ ఇందులో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. దీని ప్రకారం.. ఓసీలకు 10 శాతం, బీసీలకు 5 శాతం సడలింపు ఇచ్చినట్టయింది. దీంతో.. తమకు ఎలాంటి సడలింపు ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని నిరసనలు వ్యక్తం చేయగా ప్రభుత్వం స్పందించి జీవోను సవరించింది. తాజా నిర్ణయం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Bihar: నితీష్ ప్రభుత్వానికి షాక్.. వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!