Site icon NTV Telugu

డెలివరీ బాయ్స్‌ పేరుతో ల్యాప్‌టాప్‌ల చోరీ

ఇళ్లలోని ల్యాప్‌టాప్‌లను దొంగిలించే ఓ ముఠాను కూకట్‌ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డికి చెందిన పాటిల్‌ శివాజీ (23), బోయిన వెంకటేశం (21), అజ్జంపల్లి గోవర్థన్‌ రెడ్డి (23) ముగ్గు రు స్నేహితులు . వీరిలో వెంకటేశం, గోవర్థన్‌రెడ్డికి కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండలో ఉంటూ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. వీరితో శివాజీ కలిశాడు. వీరు ముగ్గురు కలిసిన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

పగటి వేళ్లలో పుడ్‌ డెలివరీ బాయ్స్‌గా వెళ్లి రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నారు. కాగా ఈ ముఠా ఇటీవల కూకట్‌ పల్లిలో ఏడు ల్యాప్‌టాప్‌లను కేపీహెచ్‌బీలోని పద్మావతి ప్లాజాలో విక్రయించేందుకు ముగ్గరు వ్యక్తులు బైక్‌ పై వచ్చారు. అక్కడే తనిఖీలు నిర్వహిస్తున్న క్రైం సిబ్బందికి వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిజాలు ఒప్పుకున్నారని క్రైం సీఐ ఆంజేయులు తెలిపారు. కాగా వీరి నుంచి ఏడు ల్యాప్‌టాప్‌లతో పాటు ఒక ఐప్యాడ్‌, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

https://ntvtelugu.com/ktr-expressed-impatience-over-teenmar-mallanna/


Exit mobile version