CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. రూ. 9377 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. హెచ్ఐసీసీలో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది అభివృద్ధి ఉత్సవం అని , తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధి మనకు అత్యంత ప్రాధాన్యం అని, ముందు భారతదేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అని సీఎం అన్నారు. ఆ స్పూర్తితోనే దేశ నిర్మాణానికి ప్రధాని మోడీ వికసిత్ భారత్ 2047ను ప్రకటించారని, మేము కూడా అందులో భాగస్వాములమయ్యామని, తెలంగాణ రైజింగ్ మోడీ పూర్తిగా సహకరిస్తారనే విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.
Also Read
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
Read Also: TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
తెలంగాణను దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు తాము ప్రయత్నిస్తు్న్నామని, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించడానికి మోడీ వచ్చారని సీఎం అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయని, ప్రధాని మోడీ ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చారని, ఇక మనం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు.
ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎలా సహకరించారో, తెలంగాణ ప్రజలు కూడా రాబోయే 10 ఏళ్లలో మీ సహకారంతో రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. నాడు గుజరాత్కు మన్మోహన్ సింగ్ సహకరించినట్లే, ప్రధాని మోడీ ఇప్పుడు తెలంగాణకు సహకరిస్తారని విశ్వసిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూర్, హైదరాబాద్ వంటి మహా నగరాలు ఉన్నాయని, దేశంలో అభివృద్ధి చెందాలంటే యువతకు ఉద్యోగాలు రావాలన్ని ఈ మహా నగరాల అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రుల్ని, మిమ్మల్ని కలిశామని కొన్ని ప్రాజెక్టులకు అత్యవసర అనుమతులు ఆమోదాలు అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. మోడీది పెద్ద మనుసు అని బండి సంజయ్, కిషన్ రెడ్డి చెబుతున్నారు, తెలంగాణ విషయంలో పెద్ద మనసు చూపాలని సీఎం కోరారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..