CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. రూ. 9377 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. హెచ్ఐసీసీలో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది అభివృద్ధి ఉత్సవం అని , తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధి మనకు అత్యంత ప్రాధాన్యం అని, ముందు భారతదేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అని సీఎం అన్నారు. ఆ స్పూర్తితోనే దేశ నిర్మాణానికి ప్రధాని మోడీ వికసిత్ భారత్ 2047ను ప్రకటించారని, మేము కూడా అందులో భాగస్వాములమయ్యామని, తెలంగాణ రైజింగ్ మోడీ పూర్తిగా సహకరిస్తారనే విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.
Also Read
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
Read Also: TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
తెలంగాణను దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు తాము ప్రయత్నిస్తు్న్నామని, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించడానికి మోడీ వచ్చారని సీఎం అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయని, ప్రధాని మోడీ ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చారని, ఇక మనం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు.
ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎలా సహకరించారో, తెలంగాణ ప్రజలు కూడా రాబోయే 10 ఏళ్లలో మీ సహకారంతో రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. నాడు గుజరాత్కు మన్మోహన్ సింగ్ సహకరించినట్లే, ప్రధాని మోడీ ఇప్పుడు తెలంగాణకు సహకరిస్తారని విశ్వసిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూర్, హైదరాబాద్ వంటి మహా నగరాలు ఉన్నాయని, దేశంలో అభివృద్ధి చెందాలంటే యువతకు ఉద్యోగాలు రావాలన్ని ఈ మహా నగరాల అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రుల్ని, మిమ్మల్ని కలిశామని కొన్ని ప్రాజెక్టులకు అత్యవసర అనుమతులు ఆమోదాలు అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. మోడీది పెద్ద మనుసు అని బండి సంజయ్, కిషన్ రెడ్డి చెబుతున్నారు, తెలంగాణ విషయంలో పెద్ద మనసు చూపాలని సీఎం కోరారు.
తాజావార్తలు
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
-
IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!