CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. రూ. 9377 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. హెచ్ఐసీసీలో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది అభివృద్ధి ఉత్సవం అని , తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధి మనకు అత్యంత ప్రాధాన్యం అని, ముందు భారతదేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అని సీఎం అన్నారు. ఆ స్పూర్తితోనే దేశ నిర్మాణానికి ప్రధాని మోడీ వికసిత్ భారత్ 2047ను ప్రకటించారని, మేము కూడా అందులో భాగస్వాములమయ్యామని, తెలంగాణ రైజింగ్ మోడీ పూర్తిగా సహకరిస్తారనే విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.
Also Read
- CM Revanth Reddy: రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
- Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
Read Also: TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
తెలంగాణను దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు తాము ప్రయత్నిస్తు్న్నామని, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించడానికి మోడీ వచ్చారని సీఎం అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయని, ప్రధాని మోడీ ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చారని, ఇక మనం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు.
ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎలా సహకరించారో, తెలంగాణ ప్రజలు కూడా రాబోయే 10 ఏళ్లలో మీ సహకారంతో రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. నాడు గుజరాత్కు మన్మోహన్ సింగ్ సహకరించినట్లే, ప్రధాని మోడీ ఇప్పుడు తెలంగాణకు సహకరిస్తారని విశ్వసిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూర్, హైదరాబాద్ వంటి మహా నగరాలు ఉన్నాయని, దేశంలో అభివృద్ధి చెందాలంటే యువతకు ఉద్యోగాలు రావాలన్ని ఈ మహా నగరాల అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రుల్ని, మిమ్మల్ని కలిశామని కొన్ని ప్రాజెక్టులకు అత్యవసర అనుమతులు ఆమోదాలు అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. మోడీది పెద్ద మనుసు అని బండి సంజయ్, కిషన్ రెడ్డి చెబుతున్నారు, తెలంగాణ విషయంలో పెద్ద మనసు చూపాలని సీఎం కోరారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
-
JD Vance: స్విట్జర్లాండ్లో జేడీ వాన్స్కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!