NTV Telugu Site icon

Nagar Kurnool: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం.. విద్యార్థులకు మెమోలలో తప్పుగా వచ్చిన ఫోటోలు

Inter

Inter

నాగర్ కర్నూల్ లో తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగుచూసింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేలా చేసింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసిన తప్పు వల్ల విద్యార్థులకు మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 లో ఇంటర్మీడియట్ పాస్ అయిన 60 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్మీడియట్ మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. ఈ విద్యార్థులంతా ప్రభుత్వ బిసి వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కళాశాలకు చెందిన వారే కావడం గమనార్హం.

Also Read:Prakasam: కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన కన్నతల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని ఉయ్యాలవాడ బిసి వెల్ఫేర్ జ్యోతిరావు పూలే,కోడేరు బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే విద్యార్థులు. మెమోల్లో విద్యార్థుల ఫొటోలు తప్పుగా ప్రింట్ అయిన ఘటనపై స్పందించారు డిఐఈఓ వెంకటరమణ. తమ నుంచి ఎలాంటి తప్పు లేదని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచే సరి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. విద్యార్థులంతా వివిధ బీటెక్ కళాశాలలో చేరినప్పటికీ మెమోలు సరిగా లేకపోవడంతో కళాశాలలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి మెమోలను సరిచేయాలని విద్యార్థులు కోరారు.