Parliament Elections 2024: కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలను కేంద్రాలకు తరలించి ఓట్లను లెక్కించనున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్లో 14 టేబుళ్లు, నాగర్కర్నూల్ పార్లమెంట్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టనున్నారు.
Read More: Akhanda 2 : అఖండ 2 లో ఆ సీనియర్ హీరోయిన్ కు ఛాన్స్..?
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ ఓట్ల లెక్కింపునకు అధికారులు కొన్ని నివేదికలు రూపొందించారు. అయితే..ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయా జిల్లాల పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో.. కౌంటింగ్ ఏర్పాట్లను మహబూబ్ నగర్ రిటర్నింగ్ అధికారి రవినాయక్, నాగర్ కర్నూల్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. కాగా.. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 31 మంది అభ్యర్థులు, నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
Read More: Telangana Lok Sabha Election: 34 కౌంటింగ్ కేంద్రాలు.. 12 టీమ్లతో సెక్యూరిటీ..
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా.. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 282 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 21 రౌండ్లు, నారాయణపేటలో 270 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 20 రౌండ్లు, మహబూబ్ నగర్ లో 275 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు, 20 రౌండ్లు ఏర్పాటు చేశారు. జడ్చర్లలోని 274 పోలింగ్ కేంద్రాలకు 20 రౌండ్ల 14 టేబుళ్లు, దేవరకద్రలోని 289 పోలింగ్ కేంద్రాలకు 21 రౌండ్ల 14 టేబుళ్లు, మక్తల్లోని 284 పోలింగ్ కేంద్రాలకు 21 రౌండ్ల 14 టేబుళ్లు, షానగర్లోని 263 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు 19 రౌండ్ల వారిగా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
AP Election Results 2024 Live Updates: ఏపీ ఎన్నికల ఫలితాలు 2024 లైవ్ అప్డేట్స్..
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!