Panjagutta CI Durga Rao: పంజాగుట్ట సీఐ దుర్గారావు అరెస్ట్.. ఏపీలో అదుపులో తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panjagutta CI Durga Rao: హైదరాబాద్ పంజాగుట్ట సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజాభవన్ వద్ద బారికేడ్ కొట్టిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ తప్పించుకున్న కేసులో సీఐ దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. ఇటీవల పంజాగుట్టలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంతా సీపీకి బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే సస్పెన్షన్ తర్వాత సీఐ దుర్గారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది లీకేజీలతో తప్పించుకుంటున్న దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీఐ దుర్గారావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో సీఐ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Read also: OTT Movies : ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఈ కేసులో దుర్గారావు నిందితుడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు పారిపోయేందుకు దర్గారావు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో సీఐ దుర్గారావును హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. ఇదే కేసులో బోదన్ సీఐ ప్రేముకుమార్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ్ కుమార్ షకీల్ కొడుకు బలవంతంగా విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దుర్గారావును సస్పెండ్ చేసిన అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద షకీల్ కుమారుడు సోహెల్ కారును అతివేగంతో అతివేగంగా నడుపుతూ బారికేడ్లను ఢీకొట్టాడు. పంజాగుట్ సీఐ సోహెల్కు బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీంతో స్పందించిన పోలీసు అధికారులు సీఐని సస్పెండ్ చేశారు. సెక్షన్ 17 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.అప్పట్లో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒకరి మరణానికి కూడా సోహెల్ కారణమని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు షకీల్ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండడంతో సోహెల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. బేగంపేట ప్రజాభవన్లో సోహెల్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కేసులో పోలీసులకు చిక్కారు. షకీల్ చెప్పిన మాటలు విని దుర్గారావు మొదటికే మోసం అయినట్లు తెలుస్తోంది.
Ambati Rambabu: జగన్ అర్జునుడు.. అభిమన్యుడు కాదు..
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?