Palugula Bridge: ఐదేళ్ళయినా అడుగైనా పడని పలుగుల వంతెన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రెండు జిల్లాల ప్రజల చిరకాల వాంఛ వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. గోదావరి పై బ్రిడ్జ్ నిర్మిస్తే ఆ రెండు జిల్లాల వాసులకు ప్రయాణ దూర భారం తగ్గడమే కాకుండా సులభతరం అవుతుందని భావించిన వారందరికి నిరాశే ఎదురవుతుంది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం మట్టి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆనందాలు వెల్లివిరిసినా ఐదేళ్ళు అవుతున్నా వంతెన ఊసే లేదని స్థానికులు వాపోతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి- మంచిర్యాల జిల్లాల మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో రవాణా సౌకర్యంతో పాటు దూరభారం తగ్గనుందని సంబరపడిన ప్రజలకు నిరాశ తప్పడంలేదు. జిల్లాలోని మహదేవపూర్ మండలం పలుగుల వద్ద గోదావరిపైన 1.2 కిలోమీటర్ల పొడవుతో 40 పిల్లర్లతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ గ్రామ గోదావరి ఒడ్డు వరకు వంతెన నిర్మాణానికి 2017 ఏప్రిల్లో రెండు వారాల పాటు యంత్రాలతో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించారు. గోదావరిలో మొత్తం ఏడు చోట్ల మట్టి నమూనా పరీక్షలు చేపట్టారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
హైదరాబాద్ కు చెందిన హెచ్ఐబీఎస్ సంస్థ ఆధ్వర్యంలో 40 మీటర్ల లోతు వరకు మట్టి పరీక్షించారు. కానీ ఇప్పటి వరకు వంతెన నిర్మాణంపై ఊసెత్తక పోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుంట్లం, ఎర్రాయి పేట మీదుగా కూడా నిర్మాణం చేపట్టడానికి అప్పటి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. కుంట్లం, ఎర్రాయిపేటల మధ్య గోదావరిలో నిర్మాణం జరిగితే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట ఒడ్డుపైనే జాతీయ రహదారి లింకు ఉంటుంది.సారపాక టు కౌటాల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మహదేవపూర్ మండలం నుంచి చెన్నూర్ గోదావరి వరకు వంతెన నిర్మాణం చేపట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ క్రమంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2017 ఫిబ్రవరి 5న పలుగుల వద్ద గోదావరి తీరాన్ని సందర్శించారు.
పలుగుల గోదావరిలో మట్టి నమూనా పరీక్షలు చేసి ఐదేండ్లు గడిచిన వంతెన నిర్మాణంపై ఎలాంటి పురోగతి లేక పోవడంతో ఈ ప్రాంత వాసులు నిరాశకు లోనవుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం చిరకాల వాంఛగా మిగిలిపోయింది. ప్రభుత్వం పలుగుల వద్ద వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి వేగం పెంచాలని స్థానికులు కోరుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అన్నారం వద్ద వంతెన కమ్ బ్యారేజీ అందుబాటులో ఉంది. పలుగుల వద్ద వంతెన నిర్మాణం పూర్తయితే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు కుమ్రుంభీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు ప్రయాణం దూరం తగ్గనుంది.
అదే విధంగా పలుగుల ,మద్దులపల్లి వాసులు నిత్యావసరలకు,వైద్య ,వ్యాపార పరంగా పొరుగున ఉన్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ కు వెళ్తుంటారు. ప్రస్తుతం కాళేశ్వరం ,సీరోంచ మీదుగా చెన్నూర్ వెళ్లాలంటే 40 కి.మీ. దూరం వస్తుంది. కాగా బ్రిడ్జ్ నిర్మిస్తే 4 కిలో మీటర్లలో సులువుగా చెన్నూర్ కు చేరుకుంటామని స్థానికులు అంటున్నారు. ఈ వంతెన నిర్మాణంతో కొమురం భీం ,మంచిర్యాల , జయశంకర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యాలు పెరిగి, దూరభారం తగ్గనుంది. ఈ కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.
Hyderabad:ఇవాళ, రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
తాజావార్తలు
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!