Operation Karregutta : ముందుకు సాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్ట
- ములుగు లో కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్ట
- రహదారి నిర్మాణ పనులకు గ్రేహౌండ్స్ డీజీ శంకుస్థాపన
- ల్యాండ్ మైన్స్ నిర్వీర్యానికి చర్యలు
- నేరవేరనున్న గిరిజన గ్రామాలకు రహదారి కల
Operation Karregutta : ములుగు జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న కర్రెగుట్ట ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. వాజేడు మండలం మొరుమూరు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు నుండి కర్రెగుట్టల వరకు రహదారి నిర్మాణ పనులకు గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ భూమిపూజ చేయడంతో, ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లైంది.
మొరుమూరు గ్రామం నుంచి పామునూర్, జెల్లా, డోలి, తడపాల, చెలిమల గ్రామాల మీదుగా కర్రెగుట్టల వరకు రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఈ రహదారి పూర్తయ్యేంత వరకు గిరిజన గ్రామాలు ప్రధాన సౌకర్యాలకు దూరంగానే ఉండేవి. అత్యవసర సేవలు, విద్య, వైద్యం, మార్కెట్లకు చేరేందుకు ఘనమైన ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు రోడ్డు నిర్మాణం ఆ గ్రామాలకు ఆశాకిరణంగా మారింది.
Also Read
అయితే ఇది సాధారణ రోడ్డు నిర్మాణం కాదు. ఈ ప్రాంతం గతంలో మావోయిస్టు కార్యకలాపాలకు నిలయం కావడంతో రహదారి పనులను అత్యంత సున్నితంగా చేపట్టుతున్నారు. ముందుగా కర్రెగుట్ట పరిసరాల్లో మావోయిస్టులు పెట్టి ఉండే అవకాశం ఉన్న ల్యాండ్ మైన్స్, ప్రెషర్ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయడానికి సీఆర్పీఎఫ్ ప్రత్యేక బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. మొత్తం ప్రాంతాన్ని ముందుగా భద్రతా దళాలు పరిశీలిస్తున్నాయి.
Ananthapur : అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అనంతపురం కలక్టరేటు వద్ద ధర్నా!
ప్రమాదాలను అంచనా వేసి, నివారించేందుకు ‘ఫార్వర్డ్ ఆపరేషన్ బ్లాక్ బేస్ క్యాంపు’ కూడా ఏర్పాటు చేశారు. పోలీసు పర్యవేక్షణలోనే రహదారి పనులు జరుగుతున్నాయి. అడవి ప్రాంతం కావడంతో, రహదారి పనుల భద్రత కోసం లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ముప్పులను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం లభిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేకూర్చేందుకు చేపడుతున్న చర్యలలో భాగంగా ఈ ప్రాజెక్ట్ను వేగవంతం చేస్తోంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే, ఆ ప్రాంత ప్రజలకు చేరువలోనే ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, పోలీసు బలగాల రాకపోకలు సులభమవుతాయి. దీంతో ప్రాంతంలో శాంతి భద్రత మెరుగుపడటమే కాకుండా, భయం లేకుండా జీవించే హక్కు గిరిజనులకు మరింత బలపడుతుంది.
ఈ కార్యక్రమంలో ఆపరేషన్ GC రాఘవేందర్ రెడ్డి, OSD దయానంద్, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ పాల్గొని రహదారి పనుల పురోగతిని పరిశీలించారు. కర్రెగుట్ట ప్రాంత అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఈ రహదారి పూర్తయ్యే రోజున కర్రెగుట్టల గిరిజన గ్రామాలకు నిజమైన అభివృద్ధి దిశలో కొత్త అధ్యాయం ప్రారంభమవనుంది.
CM Revanth Reddy : పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది..
తాజావార్తలు
-
Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
-
Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
-
Kalki 2 Sequel Update: ‘కల్కి 2’లోకి కోలివుడ్ స్టార్ హీరో ఎంట్రీ..
-
KaruppuAudioLaunch : ఏకంగా 73 సినిమాలకు మ్యూజిక్ చేస్తున్న యంగ్ సెన్సేషన్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!