Operation Karregutta : ముందుకు సాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్ట
- ములుగు లో కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్ట
- రహదారి నిర్మాణ పనులకు గ్రేహౌండ్స్ డీజీ శంకుస్థాపన
- ల్యాండ్ మైన్స్ నిర్వీర్యానికి చర్యలు
- నేరవేరనున్న గిరిజన గ్రామాలకు రహదారి కల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Karregutta : ములుగు జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న కర్రెగుట్ట ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. వాజేడు మండలం మొరుమూరు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు నుండి కర్రెగుట్టల వరకు రహదారి నిర్మాణ పనులకు గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ భూమిపూజ చేయడంతో, ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లైంది.
మొరుమూరు గ్రామం నుంచి పామునూర్, జెల్లా, డోలి, తడపాల, చెలిమల గ్రామాల మీదుగా కర్రెగుట్టల వరకు రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఈ రహదారి పూర్తయ్యేంత వరకు గిరిజన గ్రామాలు ప్రధాన సౌకర్యాలకు దూరంగానే ఉండేవి. అత్యవసర సేవలు, విద్య, వైద్యం, మార్కెట్లకు చేరేందుకు ఘనమైన ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు రోడ్డు నిర్మాణం ఆ గ్రామాలకు ఆశాకిరణంగా మారింది.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
అయితే ఇది సాధారణ రోడ్డు నిర్మాణం కాదు. ఈ ప్రాంతం గతంలో మావోయిస్టు కార్యకలాపాలకు నిలయం కావడంతో రహదారి పనులను అత్యంత సున్నితంగా చేపట్టుతున్నారు. ముందుగా కర్రెగుట్ట పరిసరాల్లో మావోయిస్టులు పెట్టి ఉండే అవకాశం ఉన్న ల్యాండ్ మైన్స్, ప్రెషర్ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయడానికి సీఆర్పీఎఫ్ ప్రత్యేక బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. మొత్తం ప్రాంతాన్ని ముందుగా భద్రతా దళాలు పరిశీలిస్తున్నాయి.
Ananthapur : అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అనంతపురం కలక్టరేటు వద్ద ధర్నా!
ప్రమాదాలను అంచనా వేసి, నివారించేందుకు ‘ఫార్వర్డ్ ఆపరేషన్ బ్లాక్ బేస్ క్యాంపు’ కూడా ఏర్పాటు చేశారు. పోలీసు పర్యవేక్షణలోనే రహదారి పనులు జరుగుతున్నాయి. అడవి ప్రాంతం కావడంతో, రహదారి పనుల భద్రత కోసం లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ముప్పులను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం లభిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేకూర్చేందుకు చేపడుతున్న చర్యలలో భాగంగా ఈ ప్రాజెక్ట్ను వేగవంతం చేస్తోంది. రోడ్డు నిర్మాణం పూర్తయితే, ఆ ప్రాంత ప్రజలకు చేరువలోనే ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, పోలీసు బలగాల రాకపోకలు సులభమవుతాయి. దీంతో ప్రాంతంలో శాంతి భద్రత మెరుగుపడటమే కాకుండా, భయం లేకుండా జీవించే హక్కు గిరిజనులకు మరింత బలపడుతుంది.
ఈ కార్యక్రమంలో ఆపరేషన్ GC రాఘవేందర్ రెడ్డి, OSD దయానంద్, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ పాల్గొని రహదారి పనుల పురోగతిని పరిశీలించారు. కర్రెగుట్ట ప్రాంత అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఈ రహదారి పూర్తయ్యే రోజున కర్రెగుట్టల గిరిజన గ్రామాలకు నిజమైన అభివృద్ధి దిశలో కొత్త అధ్యాయం ప్రారంభమవనుంది.
CM Revanth Reddy : పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది..
తాజావార్తలు
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్కు సీక్వెల్ రెడీ!
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!