ఎగువ నుంచి భారీ వరద నీరు రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇప్పటికే అధికారులు 2 క్రస్ట్ గేట్ల ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 67,378 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 70,836 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 310.8498 టీఎంసీలుగా ఉంది.
ఇదిలా ఉంటే.. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 26,165 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 74,460 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.50 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిలువ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.0439 టీఎంసీలుగా ఉంది. దీనితో పాటు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.