స్మగ్లింగ్ చేసేందుకు కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తీరా అధికారులకు దొరికి జైలుపాలవుతున్నారు. అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సొమాలీయన్ దేశానికి చెందిన మహమూద్ అలీ అనే వ్యక్తి షార్జా వెళ్లేందుకు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నాడు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్ను తన లగేజ్ బ్యాగ్లో దాచి తరలించేందుకు యత్నించాడు.
అయితే మహమూద్ అలీపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు అతడితో పాటు తన లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో 30 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్స్ బయటపడ్డాయి. దీంతో 30 లక్షల విలువైన యూఎస్ డాలర్ల్ను సీజ్ చేసి మహమూద్ అలీని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈమేరకు ఫేమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.