Komaram Bheem: పులి దాడిలో పశువులు చనిపోతే రూ.5 వేలు.. అటవీశాఖ అధికారులు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komaram Bheem: కొమరం భీం ఆసిఫాబాద్ లో పులుల మరణాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు పులులు రెండురోజుల వ్యవధిలో చనిపోవడం పలు అనుమానాలు రేకెత్తించాయి. దీంతో అటవీశాఖ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి పులుల మృతికి కారకులైన వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. పులుల మృతికి కారుకులైన ముగ్గరుని అటవీశాఖ అధికారులు అదుపులో తీసుకున్నవిషయం తెలిసిందే. ముగ్గురిలో మైనర్ బాలుడు ఉండటం గమనార్హం. అయితే పులులను చంపింది ఆవులపై దాడి చేసి చంపునందుకే అని నిందితులు దర్యాప్తులో వెల్లడించారు. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్త మయ్యారు. ఆవులపై పులులు దాడి చేసి చంపితే ఆవు యజమానికి రూ.5వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో పులుల మరణాలు అరికట్టవచ్చని భావిస్తున్నారు.
Read also: Stunning Catch: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే!
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
కాగజ్ నగర్ మండలంలో రెండు పులుల మరణాల తర్వాత అటవీశాఖ అప్రమత్తమైంది. కోసిన, దరిగాం గ్రామాల్లో పులుల రక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. పులుల సంచారం , అలాగే పశువులపై దాడి చేస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పులి దాడిలో పశువులు చనిపోతే యజమాని బాధపడాల్సిన పనిలేదని.. వారికి తక్షణమే 5 వేలు ఇస్తామని వెల్లడించారు. క్యాటిల్ చనిపోయిన వారం రోజుల్లో మొత్తం డబ్బులిస్తామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అడవుల్లో ఉచ్చులు, విద్యుత్ వైర్లు విష ప్రయోగం లాంటివి చేయోద్దని హెచ్చరించారు. పులుల సమాచారం కోసం అటవీశాఖ సిబ్బంది నంబర్లను అధికారులు స్థానికులు ఇచ్చారు. సమాచారం కోసం వారు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు డయల్ చేయాలని సూచించారు. పులులకు విషం పెట్టి చంపిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాంప్ లెట్ లు తయారు చేసి వాటిలో అటవీ అధికారుల నెంబర్లను ఇవ్వడం జరింగిదని వాటికి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
Ponnam Prabhakar: అనాడు రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్ర వెలికి తీశారు..
తాజావార్తలు
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!