Komaram Bheem: పులి దాడిలో పశువులు చనిపోతే రూ.5 వేలు.. అటవీశాఖ అధికారులు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komaram Bheem: కొమరం భీం ఆసిఫాబాద్ లో పులుల మరణాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు పులులు రెండురోజుల వ్యవధిలో చనిపోవడం పలు అనుమానాలు రేకెత్తించాయి. దీంతో అటవీశాఖ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి పులుల మృతికి కారకులైన వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. పులుల మృతికి కారుకులైన ముగ్గరుని అటవీశాఖ అధికారులు అదుపులో తీసుకున్నవిషయం తెలిసిందే. ముగ్గురిలో మైనర్ బాలుడు ఉండటం గమనార్హం. అయితే పులులను చంపింది ఆవులపై దాడి చేసి చంపునందుకే అని నిందితులు దర్యాప్తులో వెల్లడించారు. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్త మయ్యారు. ఆవులపై పులులు దాడి చేసి చంపితే ఆవు యజమానికి రూ.5వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో పులుల మరణాలు అరికట్టవచ్చని భావిస్తున్నారు.
Read also: Stunning Catch: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే!
Also Read
కాగజ్ నగర్ మండలంలో రెండు పులుల మరణాల తర్వాత అటవీశాఖ అప్రమత్తమైంది. కోసిన, దరిగాం గ్రామాల్లో పులుల రక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. పులుల సంచారం , అలాగే పశువులపై దాడి చేస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పులి దాడిలో పశువులు చనిపోతే యజమాని బాధపడాల్సిన పనిలేదని.. వారికి తక్షణమే 5 వేలు ఇస్తామని వెల్లడించారు. క్యాటిల్ చనిపోయిన వారం రోజుల్లో మొత్తం డబ్బులిస్తామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అడవుల్లో ఉచ్చులు, విద్యుత్ వైర్లు విష ప్రయోగం లాంటివి చేయోద్దని హెచ్చరించారు. పులుల సమాచారం కోసం అటవీశాఖ సిబ్బంది నంబర్లను అధికారులు స్థానికులు ఇచ్చారు. సమాచారం కోసం వారు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు డయల్ చేయాలని సూచించారు. పులులకు విషం పెట్టి చంపిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాంప్ లెట్ లు తయారు చేసి వాటిలో అటవీ అధికారుల నెంబర్లను ఇవ్వడం జరింగిదని వాటికి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
Ponnam Prabhakar: అనాడు రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్ర వెలికి తీశారు..
తాజావార్తలు
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!