Bandi Sanjay: నోటీసులు, కేసులు, జైళ్లు నాకేమి కొత్త కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: నాకు నోటీస్ లు ఇస్తే స్వీకరించేందుకు సిద్దమన్నారు. బండి సంజయ్ కి నోటీసులు, కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నేను సీఎం లాగా కుట్రలు చేయడం లేదన్నారు. కాలు విరిగింది అనో కరోనా వచ్చింది అనో తపించుకోనని అన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఇంటికి వెళ్లి నిన్న జరిగిన ఘటనపై బండి సంజయ్ ఆరాతీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని బండిసంజయ్ ఆరోపించారు. రాజకీయాల కోసం కేసీఅర్ సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారు అంటూ నిప్పుటు చెరిగారు. కేసీఅర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర నుంచి తరిమికొట్టేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారపి అన్నారు.
Read also: Bangladesh: శ్రద్ధా హత్య తరహాలోనే హిందూ యువతిని చంపి, ముక్కలు చేసిన లవర్
Also Read
ముఖ్యమంత్రి కేసీఅర్ తక్షణమే ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఅర్ కుటుంబంలో అంతర్గత ఘర్షణలు ప్రారంభమయ్యాయని అని ఆరోపించారు. కేసీఅర్ ముఖ్యమంత్రి, తండ్రిగా విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్. అమిత్ షా దృష్టికి దాడి ఘటనను తీసుకెళ్లామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రను నమ్ముకున్నారు… మేము చట్టాన్ని నమ్ముకున్నామన్నారు. ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? నీ అయ్య ఇస్తాడా? అంటూ ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సహకారంతో టీఆర్ఎస్ కిరాయి గుండాలు విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపించారు. సీఎం కుటుంబ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చేశారని అన్నారు. అరవింద్ నాన అదృష్టవశాత్తూ ఇక్కడ లేరు ఉంటే పరిస్థితి ఏంది.. ప్రమాదం తప్పిందని అన్నారు. హోమో ఫోబియాలో కుటుంబం ఉందని, పోయే కాలం దగ్గర పడ్డదని, ఆ కుటుంబంకి అర్థం అయిందని బండి సంజయ్ అన్నారు. హిందువులు పవిత్రంగా భావించే లక్ష్మి, తులసి, దుర్గ దేవిల ఫోటోల మీద దాడి చేశారన్నారు. హిందువులు అయితే దేవుళ్ళపై దాడి చేయరని మండిపడ్డారు. దేవుళ్ళ మీద దాడి చేసినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read also: Sandhya Devanathan: మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గురించి ఈ విషయాలు తెలుసా?
తెలంగాణ సమాజం ఆలోచించాలని, దాడులు భరిద్దామా? అంటూ ప్రశ్నించారు. సెంటిమెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు కానీ కుదరలేదని ఎద్దేవ చేశారు. మహిళల మీద రాయి విసిరారని, అరవింద్ ఆరోపణ వాస్తవం అని తెలంగాణ సమాజం గ్రహిస్తుందని అన్నారు. ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? నీ అయ్య ఇస్తాడా? అంటూ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని మండిపడ్డారు. ఇళ్ళ మీద దాడులు చేయడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. మహిళల గురించి మాట్లాడే హక్కు కవితకు లేదని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శలు చేయాలి తప్పితే.. దాడి చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపై దాడులు చేయడం మంచిది కాదు, కుటుంసభ్యులకు రాజకీయాలతో ఏమీ సంబంధం? అంటూ ప్రశ్నించారు. ఇంట్లో వృద్దులు, చిన్న పిల్లలు ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ప్రాణాలు పోతే ఎవరూ బాధ్యులు? అంటూ ప్రశ్నలతో ముంచెత్తారు.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!