Kavitha Yatra: నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లాల యాత్రకు శ్రీకారం..
- నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పేరుతో యాత్ర..
- సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు కవిత రూట్ మ్యాప్..
- ఫిబ్రవరి 13 వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ యాత్ర చేయనున్న కవిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha Yatra: నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నాలుగు నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది. తన మెట్టి నిల్లు నిజామాబాద్ నుంచి జనం బాట ప్రారంభించబోతుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఇందల్ వాయి టోల్ గేట్ దగ్గరకు చేరుకోనున్న కవిత.. బర్దిపూర్ నుంచి జాగృతి కార్యాలయం వరకు బైక్ ర్యాలీలో పాల్గొననుంది. జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. అనంతరం నవీపేట మండలం యంచ వద్ద ముంపు బాధితుల తో సమావేశం కానున్నారు. నందిపేట మండలం సీహెచ్ కొండూరులో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కవిత సందర్శించనున్నారు.
Read Also: Telangana Govt: మున్సిపాలిటీలకు భారీ నజరానా.. రూ.2780 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్!
Also Read
ఇక, సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు కవిత రూట్ మ్యాప్ రెడీ చేసుకుంది. నిజామాబాద్ నుంచి జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈరోజు ఉదయం 9గంటలకు గన్ పార్క్ లో నివాళులర్పించున్న కవిత.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకుని జిల్లాల యాత్ర మొదలు పెట్టనుంది. ఫిబ్రవరి 13 వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ యాత్ర చేయనున్నారు. అయితే, కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. యాత్రలో భాగంగా మేథావులు, విద్యావంతులను కలవాలని నిర్ణయించింది. రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలనే అంశాలపై జాగృతి అధ్యక్షురాలు చర్చించనుంది. అలాగే, ప్రజలు కోరుకుంటే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటన చేసింది. జిల్లాల యాత్ర పూర్తి అయ్యేలోపు కవిత రాజకీయ పార్టీపై క్లారిటీ రానుంది.
తాజావార్తలు
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!