Dedicated Commission: నేడు నిజామాబాద్ జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటన..
- నిజామాబాద్ జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటన..
- కులాల స్థితి గతుల పై అభిప్రాయ సేకరణ చేయనున్న డెడికేటెడ్ కమిషన్.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dedicated Commission: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ జిల్లాల వారీగా బహిరంగ విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈనేపథ్యంలో నేడు నిజామాబాద్ జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటించనుంది. కులాల స్థితి గతులపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ చేయనున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, బీసీ సంఘాలు స్వచ్ఛంద సంస్థల నుంచి కమిషన్ అభిప్రాయ సేకరణ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Read also: Vizag Central Jail: విశాఖ సెంట్రల్ జైలులో అవాంఛనీయ ఘటనలు..! ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు..
Also Read
అయితే.. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. స్థానిక సంస్థల ద్వారా కల్పించాల్సిన రిజర్వేషన్లపై కమిషన్ సభ్యులు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజాభిప్రాయాలను సేకరిస్తారని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా కులాల స్థితిగతులపై వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను ప్రత్యేక కమిషన్ కు తెలియజేయవచ్చని సూచించారు. అభిప్రాయాలు వ్యక్తం చేసే వారు తమ వాదనలకు మద్దతుగా తమ వద్ద ఉన్న సమాచారం, మెటీరియల్, ఆధారాలను తమ అభ్యర్థనలతో సమర్పించాలని ఆయన అన్నారు. కాగా.. బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అందించేదుంకు గడువు నిన్నటితో అనగా (బుధవారంతో) ముగిసింది.
Read also: Air Hostess: ఎయిర్ హోస్టెస్తో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడు.. ఆ తరువాత..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?