MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు సోషల్ మీడియా బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Arvind: తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఎన్నికలకు సంబంధించి బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికే ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకం చేసేందుకు బీజేపీ నాయకత్వం కూడా సిద్ధమైంది. ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఎంపీకి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎంపీ అరవింద్. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ అరవింద్కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.
Read also: PSLV-C56: మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఒకేసారి ఏడు ఉపగ్రహాలు నింగిలోకి..
Also Read
- Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేసీఆర్ బ్రతికున్నంత కాలం మీకు ఇల్లు రావని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం స్కాములు తప్ప ఏమి చేయదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కు వచ్చిన 10 వేల కోట్లను కవితకు ఇచ్చాడని ఆరోపించారు. అవి తీసుకెళ్లి ఢిల్లీ లిక్కర్ లో పెట్టిందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పెట్టుకున్న సంబంధాలతో సిసోడియా జైలుకు వెళ్ళాడని అన్నారు. ఏపీలో తెలంగాణ కంటే అద్భుతమైన ఇళ్లు కట్టారని అన్నారు. ఏపీలో 8 లక్షల ఇళ్లను నిర్మించారని తెలిపారు. ప్రపంచంలో కవిత అతి పెద్ద అవినీతి పరురాలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా ముక్కు నేలకు రాయాలటమా.. నా చెప్పు కూడా రాయను అని అన్నారు. ఈమె పెద్ద ఐరన్ లెగ్.. మీ నాన్న ముక్కు నెలకు రాపిస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీమ్ గల్ లో బస్ డిపో కట్టడానికే డబ్బులు లేవు అని మంత్రి ఆర్టీసీ చైర్మన్ చెపుతున్నారని గుర్తు చేశారు. బస్ డిపో కట్టని వాళ్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నారని వ్యంగాస్త్రం వేశారు. గంజాయి విషయంలో తన కుటుంబ సభ్యులు, పాలోవర్స్ చేస్తున్నారు అని తనే ఒప్పుకున్నాడని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి చేస్తున్నారని మొన్న బయటపెట్టాక ఒప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో తిరగడానికి ఒక్కో అధ్యక్షునికి 10 లక్షలు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కవిత నాపై పోటీ చేయను అంటుంది, సో నీ దారి నువ్వు చుస్కో.. నా దారి నేను చూసుకుంటా అని అరవింద్ అన్న మాటలు ఇప్పుడు దుమారాన్ని రేకెత్తించాయి. ఎమ్మల్సీ కవిత చేసిన సవాల్ కు అరవింద్ ఇచ్చిన సమాధానంపై కవిత ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది.
Milk Gang Arrest: మేడ్చల్ అడ్డాగా కల్తీ పాల దందా.. ముఠా గుట్టు రట్టు..
తాజావార్తలు
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
-
Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
-
Kara Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ హీస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్… ఐయండిబిలో 8.2 రేటింగ్
-
Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!