స్టాఫ్ నర్స్కే లక్షలాది నెటిజన్ల మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లెట్ బండి పాట.. ఈ పది పదిహేను రోజుల నుంచి ఓ ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట… ఈ పాట మొదట్లో ఎవరు అంతగా పట్టించుకోకున్న.. ఓ పెళ్లికూతురు డాన్స్ చేయడంతో ప్రచుర్యంలోకి మరింత వచ్చింది. ఈ డాన్స్ తర్వాత రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఓ నర్స్ నృత్యం చేయడం అందరిని ఆకట్టుకుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో చేయడం వివాదానికి దారి తీయడం.. వెంటనే జిల్లా వైద్యాధికారి సుమన్ రావ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మోమో జారీ చేయడం ఇట్టే జరిగిపోయింది. కానీ స్టాఫ్ నర్స్..రజిని.. ఓ పేదింటి అమ్మాయి. ఆమెకు ఉద్యోగం పట్ల కమిట్మెంట్, నిబద్దతను వైద్య సిబ్బందే అభినందిస్తారు. పదేళ్లకు పైగా అవుట్ సోర్సింగ్ విభాగంలో పని చేసి.. ఈ మద్యే కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహిస్తుంది.
కరోనా సమయంలో కూడా కష్టపడి ప్రాణాలకు తెగించి పని చేసింది. కరోనా బారిన పడింది. కోలుకుంది. ఐన తన ఆత్మస్థైర్యాన్ని వదులుకోలేదు. ఆస్పత్రిలో సిబ్బందితో కానీ, రోగులతో కానీ ఎప్పుడు నవ్వుతూ..నవ్విస్తూ..చలాకీగా ఉంటుంది. పంధ్రాగస్టు రోజున సరధాగా చేసిన డాన్స్.. వీడియో తోటి మిత్రులకు షేర్ చేసుకోవడంతో.. అది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కి.. వైరల్ అయ్యి.. ఉద్యోగం కొల్పోయే పరిస్థితి వరకు వచ్చింది. మోమోల విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేల మంది నెటిజన్లు.. స్టాఫ్నర్స్ రజినికే మద్దతు పలికారు.. చర్యలు తీసుకోవద్దని వేడుకుంటున్నారు.ఎంతో మంది లాంచాలు తింటూ.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాంగ తప్పు లేదు కానీ..జెండా వందనం రోజు సరదాగా చేస్తే తప్పేంటి..నిన్న మొన్నటి వరకు కరోనా కష్ట కాలంలో రాత్రింభవళ్లు పని చేసిన వారు.. రీలాక్స్ ఐతే తప్పేంటి అంటూ రజినికి సపోర్ట్ చేస్తున్నారు. దీనికి తోడు సిరిసిల్లలో చాలా వర్గాల నుంచి రజినికి సపోర్ట్ దొరికింది.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
ఏబీవీపి ఏకంగా ప్రెస్మీట్ పెట్టి రజినికి ఇచ్చిన మోమోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటే ఆందోళన చెస్తామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్కు సైతం పలువురు రజిని విషయం.. పలువురు మేసేజ్లు పెట్టి చర్యలు తీసుకోవద్దని వేడుకున్నారు. రజిని కూడా సరదాగా చేసిన డాన్స్.. పొరపాటున సోషల్ మీడియాలో ఎక్కిందని.. మొదటి తప్పుగా మన్నించాలని రాతపూర్వకంగా అధికారులకు సంజీయిషి ఇచ్చింది.దీంతో అధికారులు సైతం వెనక్కి తగ్గారు.నేడో రేపో అధికారికంగా రజిని క్షమిస్తూ.. మోమోలు వెనక్కి తీసుకునే అవకాశాలు కినిపిస్తున్నాయి. క్రమశిక్షణ చర్యలో భాగంగా మాత్రం అన్ని పీహెచ్సీలకు పలు ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!