NTV Telugu Site icon

EX MLA Nandiswar Goud: మహిపాల్ రెడ్డి పాపాల రెడ్డిగా మారారు

Ex Mla Nandiswar Goud

Ex Mla Nandiswar Goud

EX MLA Nandiswar Goud: పటాన్ చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాపాల రెడ్డిగా మారారని బీజేపీ పటాన్‌ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా శివరాత్రి జాగరణ పేరుతో మహిపాల్ రెడ్డి సినీ ఆర్టిస్టులతో హిందూ ధర్మాన్ని అపహస్యం చేశారని నందీశ్వర్ గౌడ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు రావాలని అన్నారు. గోల్కొండ ఖిల్లా పై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. త్వరలో జరగనున్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు లేరని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ లో బీజేపీ అభ్యర్థిని అధిష్టానం నిలబెట్టి గెలిపించుకుంటుందని సవాల్‌ విసిరారు. బీజేపీ రాష్ట్రంలో రోజురోజుకూ బలపడుతోందని వ్యాఖ్యానించారు.

Read also: Bandi sanjay: కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. డేట్‌-టైమ్‌ ఫిక్స్‌ చెయ్, నేను రెడీ

పటాన్ చెరువులోఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాపాల రెడ్డిగా మారారని తీవ్రంగా ఆరోపించారు. 2 కోట్ల నుంచి 2 వేల కోట్లకు ఎదిగాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులతో ఓట్లను కొనాలని చూస్తున్నడని ఆరోపణలు గుప్పించారు. ఓటుకు రూ. 20 వేల నుంచి 30 వేలు ఇస్తామంటున్నరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సరైన వ్యక్తిని గెలిపిస్తారని భావిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, తన సోదరుడు దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమంగా భూములను కాజేస్తున్నారని తెలిపారు. శివరాత్రి పేరిట సినీ‌ ఆర్టిస్టులను పిలిపించి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించిన ఎమ్మెల్యే అంటూ ఆరోపణలు చేశారు. పటాన్‌చెరు ప్రజలు ఎమ్మెల్యే మహిపాల్ పట్ల విసుగు చెందారని, పాపాల రెడ్డి పై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఖాయమని తీవ్ర విమర్శనలు గుప్పించారు.
Suspicion: అనుమానంతో నిండుప్రాణం బలి.. బాబాయ్‌ పై కొడవలితో దాడి