Nagarjuna Sagar: సాగర్ కు కొనసాగుతున్న వరద.. 18 గేట్లు ఎత్తివేత..
- నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
- నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు వదులుతున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు వదులుతున్నారు. 18 గేట్లు ఐదు అడుగులు మేర పైకి ఎత్తి క్రస్ట్ గేట్ల ద్వారా 1,43,518 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో : 1,87,716 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 1,87,716 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం : 588.80 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ 308.4658 కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.5050లుగా కొనసాగుతుంది.
Read also: CM Revanth Reddy: సౌత్ కొరియాలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి.. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు
Also Read
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. అనంతరం శాంతిసిరి, నాగసిరి లాంచీల్లోని నాగార్జున కొండకు పర్యాటకులు తరలివెళ్లారు. ఓ వైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేశారు.
Read also: Heavy Rains: హైదరాబాద్ లో జోరువాన.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
అయితే నాగార్జునసాగర్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం కావడంతో సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలిరావడంతో ప్రధాన డ్యాం, పవర్ హౌస్ పరిసరాల్లోకి పర్యాటకులు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మరోవైపు మీడియాపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. సాగర్ వద్ద పోలీసుల సూచన మేరకు నాగార్జున ఇలా వ్యవహరిస్తున్నాడని ప్రేక్షకులు అంటున్నారు. ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు. మరోవైపు చిన్న పిల్లలతో వచ్చే వారు ట్రాఫిక్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు ఎండ, మరోవైపు ట్రాఫిక్ కారణంగా పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Siddhnath Temple: ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!
తాజావార్తలు
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
-
PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!