Nalgonda Farmers: కంది రైతులకు కష్టాలు..అధికారుల కొర్రీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈదేశంలో ప్రతి వస్తువుకి గరిష్ట చిల్లర ధర (MRP) వుంటుంది. కానీ, రైతుల పంటలకు మాత్రం ధర లభించడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంది రైతులకు కష్టాలు తప్పడం లేదు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, నాణ్యత పేరుతో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. తమకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గిట్టుబాటు ధర రాక కందుల రైతులు తలలు పట్టుకుంటున్నారు. 42 వేల ఎకరాల్లో కందులు సాగు చేయగా…2 లక్షల 52 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ పంట దిగుబడి బాగానే వచ్చింది. నల్గొండ ,కొండమల్లె పల్లి, మోత్కూరు, తిరుమలగిరి, సూర్యా పేట తోపాటు పలు చోట్ల మార్క్ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.. క్వింటాకు 6 వేల మూడు వందలు మద్దతు ధరకు కందులు కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు.
Also Read
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
కానీ, నాణ్యత పేరుతో కోతలు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు రోజువారీగా 500 బస్తాల కందులు వస్తున్నాయి. దీంతో మార్కెట్లోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు మార్క్ఫెడ్ అధికారులు. కంది సాగు విస్తీర్ణం ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతుల పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఆన్ లైన్ లో నమోదు కాలేదని, నాణ్యత లేవనే సాకుతో మద్దతు ధర ఇవ్వడం లేదని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు.
మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో రైతులకు క్వింటాకు మద్దతు ధర 6 వేల 3 వందలు చెల్లిస్తామన్నారు అధికారులు.. మద్దతు ధర పొందాలంటే ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచించారు. రైతులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, ఏదైనా బ్యాంక్ సే వింగ్ ఖాతా జిరాక్స్లను తీసుకురావాల్సి ఉంటుందన్నారు.
మార్క్ ఫెడ్ నిబంధనలకు అనుగుణంగానే కందులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా, మద్దతు ధర విషయంలో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ పొట్ట కొట్టకుండా, సానుకూల ధృక్పదంతో కొనుగోళ్లు జరపాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
-
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
-
Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
ట్రెండింగ్
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!