Friend Sittings: సిట్టింగ్ లో చికెన్ పెట్టిన చిచ్చు.. ఒకరి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Friend sittings:చిన్న చిన్న కారణాలు కూడా హత్యలు చేసే స్థాయికి వెళ్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో దగ్గినా, తుమ్మినా ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడరేమో అనిపిస్తుంటుంది. చిన్న గొడవలకు ఆవేశంతో ప్రాణాలను తీసేందుకు వెనుకాడటం లేదు. దానికి తోడు మద్యం సేవించి ఉండటం. ఇక ఆ మత్తులో ఏం చేస్తున్నామో అని కూడా గుర్తు ఉండదు. చిన్న మాటకు ఆగ్రహంతో రగిలిపోయి కిరాతకంగా ఎదుటి వారిని హతమార్చేందుకు వెనుకాడటం లేదు. అలా మృగాల్లా తయారవుతున్నారు. భాగ్యనగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. చికెన్ ఫ్రై వండమని స్నేహితుడు అడిగినందుకు ఓ యువకుడిని సిమెంట్ ఇటుకలతో దారుణంగా కొట్టి చంపాడు. వింటుంటేనే ఒళ్లు జలజరించే ఈ ఘటన ప్రతి ఒక్కరినీ షాక్ కు గురిచేసింది. ఇదంతా చికెన్ ఫ్రై కోసమే చేశారా? అనే ప్రశ్నలు రేకిత్తిస్తున్నాయి.
బీహార్కు చెందిన ధీరజ్మండల్ , సుశీల్గోస్వామి ఉపాధి కోసం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో జీడిమెట్ల చౌదరిగూడలో సామల నర్సింహారెడ్డి నిర్వహిస్తున్న సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లో పని చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. అయితే అప్పటికే యూనిట్లో పనిచేస్తున్న బీహార్కు చెందిన మరో ఇద్దరు సుజిత్ విజయ్ గోస్వామి, బాల నిమేష్కుమార్లు కూడా వారితో చేరారు. దీంతో స్నేహితులంతా ఒకే చోట ఉన్నాంకదా.. ఎప్పటిలాగే.. ఆదివారం అంటే జూన్ 4వ తేదీ రాత్రి సిట్టింగ్ వేద్దామని ప్లాన్ వేశారు. ధీరజ్ మండల్ సుశీల్ గోస్వామికి మందు కోసం చికెన్ ఫ్రై వండమని చెప్పాడు. కానీ.. సుశీల్ గోస్వామి అందుకు నిరాకరించడంతో ఇద్దరూ గొడవపడ్డారు. ఆగొడవ కాస్త పెద్దదైంది.
Also Read
ఆగ్రహంతో ఊగిపోయిన ధీరజ్ మండల్ సుశీల్ గోస్వామిని కొట్టేందుకు వెళ్లగా.. మిగతా ఇద్దరు స్నేహితులు అడ్డుకున్నారు. అయితే.. గతంలో కూడా ధీరజ్ మండల్ తన పట్ల ఇలాగే ప్రవర్తించాడని తెలుసుకున్న సుశీల్ గోస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కొట్టేందుకు వచ్చానన్న కోపంతో రాత్రి నుంచి ఆవేశంతో రగిలిపోయిన సుశీల్ గోశ్వరి.. తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ధీరజ్ మండల్ తలపై సిమెంట్ ఇటుకలను ఎత్తి అతికిరాతకంగా హత్య చేశాడు. ధీరజ్ చనిపోయాడని తెలియగానే అక్కడి నుంచి ఘట్కేసర్ రైల్వే స్టేషన్కు పారిపోయాడు. హత్య విషయం వెలుగులోకి రావడంతో.. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారించగా.. అసలు విషయం తెలిసింది. సుశీల్ గోస్వామి కోసం వెతుకుతున్న క్రమంలో రైల్వే స్టేషన్లోనే పోలీసులకు దొరికిపోయాడు. అయితే 8 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
GoFirst : GoFirstకు DGCA గ్రీన్ సిగ్నల్.. గాల్లో ఎగరనున్న 22 విమానాలు ?
తాజావార్తలు
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!