Friend Sittings: సిట్టింగ్ లో చికెన్ పెట్టిన చిచ్చు.. ఒకరి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Friend sittings:చిన్న చిన్న కారణాలు కూడా హత్యలు చేసే స్థాయికి వెళ్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో దగ్గినా, తుమ్మినా ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడరేమో అనిపిస్తుంటుంది. చిన్న గొడవలకు ఆవేశంతో ప్రాణాలను తీసేందుకు వెనుకాడటం లేదు. దానికి తోడు మద్యం సేవించి ఉండటం. ఇక ఆ మత్తులో ఏం చేస్తున్నామో అని కూడా గుర్తు ఉండదు. చిన్న మాటకు ఆగ్రహంతో రగిలిపోయి కిరాతకంగా ఎదుటి వారిని హతమార్చేందుకు వెనుకాడటం లేదు. అలా మృగాల్లా తయారవుతున్నారు. భాగ్యనగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. చికెన్ ఫ్రై వండమని స్నేహితుడు అడిగినందుకు ఓ యువకుడిని సిమెంట్ ఇటుకలతో దారుణంగా కొట్టి చంపాడు. వింటుంటేనే ఒళ్లు జలజరించే ఈ ఘటన ప్రతి ఒక్కరినీ షాక్ కు గురిచేసింది. ఇదంతా చికెన్ ఫ్రై కోసమే చేశారా? అనే ప్రశ్నలు రేకిత్తిస్తున్నాయి.
బీహార్కు చెందిన ధీరజ్మండల్ , సుశీల్గోస్వామి ఉపాధి కోసం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో జీడిమెట్ల చౌదరిగూడలో సామల నర్సింహారెడ్డి నిర్వహిస్తున్న సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లో పని చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. అయితే అప్పటికే యూనిట్లో పనిచేస్తున్న బీహార్కు చెందిన మరో ఇద్దరు సుజిత్ విజయ్ గోస్వామి, బాల నిమేష్కుమార్లు కూడా వారితో చేరారు. దీంతో స్నేహితులంతా ఒకే చోట ఉన్నాంకదా.. ఎప్పటిలాగే.. ఆదివారం అంటే జూన్ 4వ తేదీ రాత్రి సిట్టింగ్ వేద్దామని ప్లాన్ వేశారు. ధీరజ్ మండల్ సుశీల్ గోస్వామికి మందు కోసం చికెన్ ఫ్రై వండమని చెప్పాడు. కానీ.. సుశీల్ గోస్వామి అందుకు నిరాకరించడంతో ఇద్దరూ గొడవపడ్డారు. ఆగొడవ కాస్త పెద్దదైంది.
Also Read
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
ఆగ్రహంతో ఊగిపోయిన ధీరజ్ మండల్ సుశీల్ గోస్వామిని కొట్టేందుకు వెళ్లగా.. మిగతా ఇద్దరు స్నేహితులు అడ్డుకున్నారు. అయితే.. గతంలో కూడా ధీరజ్ మండల్ తన పట్ల ఇలాగే ప్రవర్తించాడని తెలుసుకున్న సుశీల్ గోస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కొట్టేందుకు వచ్చానన్న కోపంతో రాత్రి నుంచి ఆవేశంతో రగిలిపోయిన సుశీల్ గోశ్వరి.. తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ధీరజ్ మండల్ తలపై సిమెంట్ ఇటుకలను ఎత్తి అతికిరాతకంగా హత్య చేశాడు. ధీరజ్ చనిపోయాడని తెలియగానే అక్కడి నుంచి ఘట్కేసర్ రైల్వే స్టేషన్కు పారిపోయాడు. హత్య విషయం వెలుగులోకి రావడంతో.. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారించగా.. అసలు విషయం తెలిసింది. సుశీల్ గోస్వామి కోసం వెతుకుతున్న క్రమంలో రైల్వే స్టేషన్లోనే పోలీసులకు దొరికిపోయాడు. అయితే 8 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
GoFirst : GoFirstకు DGCA గ్రీన్ సిగ్నల్.. గాల్లో ఎగరనున్న 22 విమానాలు ?
తాజావార్తలు
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..