Mulugu Doctors: డాక్టర్ సాహసాని సలామ్.. వాగులు దాటుకుంటూ వైద్యం..
- ములుగు జిల్లా వాజేడు మండలంలోని వైద్యుని సాహసం..
- గుట్టలు-వాగులు దాటి పెనుగోలు గిరిజన ప్రజలకు వైద్యం..
- మూడు వాగులు దాటి మూడు కొండలు ఎక్కి 16 కిలోమీటర్ల కాలినడకన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mulugu Doctors: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా మందులే దిక్కు. దట్టమైన అడవుల్లో రవాణా సౌకర్యాలు లేవు.. వైద్యం అందించేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు. కానీ, ఓ వైద్యాధికారి వృత్తి పట్ల మానవత్వంతో పాటు కరుణ, నిబద్ధత ప్రదర్శించారు. కొండలు, వాగులు దాటి వైద్య సేవలు అందించారు. ముగ్గురు గ్రామస్థుల సహాయంతో, వైద్య సిబ్బంది ప్రమాదకరమైన నడుము లోతు వాగులను దాటి ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని వైద్యుని సాహసానికి అందరూ సలామ్ చేస్తున్నారు.
Read also: Mallu Bhatti Vikramarka: రుణమాఫీ డబ్బులు రైతుల అప్పులకు మళ్లించొద్దు.. బ్యాంకర్లకు భట్టి వార్నింగ్..
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి మధుకర్ వైద్యం అందజేస్తున్నారు. అయితే.. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన ప్రజలు జర్వం బారిన పడ్డారని, వారికి సరైన వైద్యం అందడం లేదని చెప్పడంతో రోగుల కోసం రంగంలోకి దిగాడు వైద్యాధికారి మధుకర్. అంతేకాదు తన ఆధ్వర్యంలో వైద్య బృందమైన హెల్త్ అసిస్టెంట్లు చిన్న వెంకటేశ్వర్లు, కోరం శేఖర్, ల్యాబ్ టెక్నీషియన్ ఇర్ప రజినీకాంత్, సిబ్బంది లకన్, ప్రశాంత్, ఆశ వర్కర్ సమ్మక్క, గుమ్మడిదొడ్డి గ్రామస్తులు కారం ఆదినారాయణ, జజ్జేరి అశోక్ అనుతీసుకుని కాలినడకన పయనమయ్యారు. మూడు వాగులు దాటి మూడు కొండలు ఎక్కి 16 కిలోమీటర్ల కాలినడకన సాయంత్రానికి పెనుగోలు చేరుకున్నారు.
Read also: TG DSC Exams: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి..
అక్కడ నివసిస్తున్న 10 కుటుంబాలకు చెందిన 39 మందికి వైద్య పరీక్షలు చేశారు. జ్వరంతో బాధపడుతున్న ముగ్గురిని గుర్తించి మందులు అందజేశారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ దోమలపై పిచికారీ చేశారు. వర్షాకాలంలో జ్వరాలపై జాగ్రత్తలను సూచించారు. మరి పెనుగోలు నుంచి తిరిగి పయనమయ్యారు. బుధవారం మధ్యాహ్నం పీహెచ్సీకి చేరుకున్నారు. అంతేకాకుండా.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం పీహెచ్సీ పరిధిలోని మట్టెవాడ శివారు తిమ్మాపురం గ్రామానికి వాగులు, వంకలు దాటి 8 కిలోమీటర్లు నడిచి బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దేవేందర్, నరేష్, సిబ్బంది లోక్యానాయక్, అరుణ, హేమలత, రజిత, సర్దార్, లాలు, కవిత, ఆశ, సీతమ్మ పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్ యమున మాట్లాడుతూ గిరిజనులు అటవీ ప్రాంతాల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. 42 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
Covid-19 : అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ కు కోవిడ్ పాజిటివ్
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!