Mullugu: ముందు దాడి చేసింది వారే.. పారెస్ట్ సిబ్బంది దాడిపై జేసీబీ బాధితులు..
- దామరవాయి అడవి ప్రాంతంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది పై దాడి ఘటన..
- ముందుగా ఫారెస్ట్ సిబ్బంది మాపై దాడి చేశారని జేసీబీ నిర్వహకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mullugu: ములుగు జిల్లా తాడువాయి ఫారెస్ట్ రేంజ్ దామరవాయి అడవి ప్రాంతంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది పై దుండగులు దాడి ఘటనపై బాధితులు స్పందించారు. జేసీబీ నిర్వాహకులు మాట్లాడుతూ.. ముందుగా ఫారెస్ట్ సిబ్బంది మాపై దాడి చేశారని జేసీబీ నిర్వహకులు తెలిపారు. జేసీబీ వాహన సహాయకుడిగా వున్న శశిధర్ తలను ఫారెస్ట్ సిబ్బంది పగలగొట్టారని తెలిపారు. దాంతో కోపోద్రిక్తులైన జేసీబీ నిర్వహకులు ఫారెస్ట్ సిబ్బంది పై దాడి చేసినట్టు తెలిపారు.
Read also: Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్కు ఘోర ప్రమాదం..
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
తాజాగా అర్ధరాత్రి 11గంటల సమయంలో తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ లోనీ దామరవాయి అడవి ప్రాంతంలో జేసీబీతో అక్రమంగా భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో రాత్రి సమయంలో విధులు నిర్వర్తిస్తూన్న ఎఫ్ ఆర్ వో వినోద్, బీట్ ఆఫీసర్ శరత్చంద్ర, సుమన్ లు జేసీబీని అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాడ్వాయి అడవి కార్యాలయలనికి తరలిస్తుండగా, జేసీబీ ఓనర్ సూరజ్ రెడ్డి మరో ఇద్దరితో కలిసి అడవి శాఖ సిబ్బంది పై విచక్షణారహితంగా ఇనుపరాలతో దాడి చేశారు. ఈ క్రమంలో వాహన లైట్లు కూడా ధ్వంసం చేసి జేసీబీని తీసుకుని వెళ్లారు. వీరి దాడిలో ఎఫ్ఆర్ఓ వినోద్ తలకు మూడు చోట్ల తీవ్రగాయాలుకాగా, శరత్ చంద్ర కు చేతివేళ్లకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
Read also: Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్కు ఘోర ప్రమాదం..
శరత్ చంద్రకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అర్ధరాత్రి రాత్రి సమయంలో అటవీశాఖ సిబ్బందిపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడ్డ దుండగులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఫారెస్ట్ ఆఫీసర్లు అసోసియేషన్ కోరింది. దాడి పై అడవి శాఖ మంత్రి కొండా సురేఖ కూడా స్పందించారు. గార్డియన్ ఆసుపత్రికి చికిత్స పొందుతున్న ఫారెస్ట్ సిబ్బందిని పరామర్శించారు. ఫారెస్ట్ సిబ్బంది పై దాడి చేసిన వారికి కఠినంగా శిక్షేస్తే తప్ప మరలా ఇలాంటివి పునరావృతం కావని అన్నారు. అయితే దీనిపై జేసీబీ బాధితులు అసలు విషయం చెప్పడంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దాడుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అయితే జేసీబీ బాధితులను శిక్షిస్తారా? లేక మొదటగ ఫారెస్ట్ సిబ్బంది దాడి చేశారనే వార్తలపై అడవి శాఖ మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Jani Master: జానీ మాస్టర్ వ్యవహారం వెనుక బడా హీరో.. భార్య కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!