Mullugu: ముందు దాడి చేసింది వారే.. పారెస్ట్ సిబ్బంది దాడిపై జేసీబీ బాధితులు..
- దామరవాయి అడవి ప్రాంతంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది పై దాడి ఘటన..
- ముందుగా ఫారెస్ట్ సిబ్బంది మాపై దాడి చేశారని జేసీబీ నిర్వహకులు..
Mullugu: ములుగు జిల్లా తాడువాయి ఫారెస్ట్ రేంజ్ దామరవాయి అడవి ప్రాంతంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది పై దుండగులు దాడి ఘటనపై బాధితులు స్పందించారు. జేసీబీ నిర్వాహకులు మాట్లాడుతూ.. ముందుగా ఫారెస్ట్ సిబ్బంది మాపై దాడి చేశారని జేసీబీ నిర్వహకులు తెలిపారు. జేసీబీ వాహన సహాయకుడిగా వున్న శశిధర్ తలను ఫారెస్ట్ సిబ్బంది పగలగొట్టారని తెలిపారు. దాంతో కోపోద్రిక్తులైన జేసీబీ నిర్వహకులు ఫారెస్ట్ సిబ్బంది పై దాడి చేసినట్టు తెలిపారు.
Read also: Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్కు ఘోర ప్రమాదం..
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
తాజాగా అర్ధరాత్రి 11గంటల సమయంలో తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ లోనీ దామరవాయి అడవి ప్రాంతంలో జేసీబీతో అక్రమంగా భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో రాత్రి సమయంలో విధులు నిర్వర్తిస్తూన్న ఎఫ్ ఆర్ వో వినోద్, బీట్ ఆఫీసర్ శరత్చంద్ర, సుమన్ లు జేసీబీని అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాడ్వాయి అడవి కార్యాలయలనికి తరలిస్తుండగా, జేసీబీ ఓనర్ సూరజ్ రెడ్డి మరో ఇద్దరితో కలిసి అడవి శాఖ సిబ్బంది పై విచక్షణారహితంగా ఇనుపరాలతో దాడి చేశారు. ఈ క్రమంలో వాహన లైట్లు కూడా ధ్వంసం చేసి జేసీబీని తీసుకుని వెళ్లారు. వీరి దాడిలో ఎఫ్ఆర్ఓ వినోద్ తలకు మూడు చోట్ల తీవ్రగాయాలుకాగా, శరత్ చంద్ర కు చేతివేళ్లకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
Read also: Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్కు ఘోర ప్రమాదం..
శరత్ చంద్రకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అర్ధరాత్రి రాత్రి సమయంలో అటవీశాఖ సిబ్బందిపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడ్డ దుండగులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఫారెస్ట్ ఆఫీసర్లు అసోసియేషన్ కోరింది. దాడి పై అడవి శాఖ మంత్రి కొండా సురేఖ కూడా స్పందించారు. గార్డియన్ ఆసుపత్రికి చికిత్స పొందుతున్న ఫారెస్ట్ సిబ్బందిని పరామర్శించారు. ఫారెస్ట్ సిబ్బంది పై దాడి చేసిన వారికి కఠినంగా శిక్షేస్తే తప్ప మరలా ఇలాంటివి పునరావృతం కావని అన్నారు. అయితే దీనిపై జేసీబీ బాధితులు అసలు విషయం చెప్పడంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దాడుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అయితే జేసీబీ బాధితులను శిక్షిస్తారా? లేక మొదటగ ఫారెస్ట్ సిబ్బంది దాడి చేశారనే వార్తలపై అడవి శాఖ మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Jani Master: జానీ మాస్టర్ వ్యవహారం వెనుక బడా హీరో.. భార్య కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!