MP Santoshkumar: మట్టికోసం మనం అంటున్న సంతోష్ కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు సేవ్ సాయిల్ ఉద్యమం సమిష్టిగా జరిపిన సంగీత కచేరీ – మట్టి కోసం మనం ముఖ్య అతిథితో పాటు పలువురు సేవ్ సాయిల్ వాలంటీర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడంతో ఈ కార్యక్రమం మొదలైంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు మట్టిని రక్షించు ఉద్యమం నిర్వాహకులు ఈరోజు హైదరాబాద్లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ – మట్టి కోసం మనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టిని రక్షించు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన పార్లమెంట్ సభ్యులు జె. సంతోష్ కుమార్ విచ్చేసారు.
మనస్పూర్తిగా ఈ ఉద్యమానికి తన మద్దతును అందించారు. “మేము అన్ని విధాలుగా సద్గురు చేపట్టిన మట్టిని రక్షించుకి మద్దతు ఇస్తాము. మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ కారణానికి అనుగుణంగా ఉంటుంది.” అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ 25 సంవత్సరాలుగా మొక్కలు పెంపొందించడం పై అవగాహన కల్పిస్తున్నారని సీఎం కేసీఆర్ స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించానని అన్నారు. హరితహారం,గ్రీన్ఇండియా ఛాలెంజ్ తో 24 శాతం ఉన్న అటవీ శాతం 33 శాతం పెరిగిందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నదుకు ధన్యవాదాలు తెలియజేసారు.
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని నా వంతు సాయంగా సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తాగునీరు,సాగునీరు ఇబ్బంది ఉండేది. రాష్ట్రం వచ్చాక 8 ఏండ్లలో సాగునీరు తాగునీరు ఇబ్బందులు తొలగాయని అన్నారు.నల్గొండ జిల్లా ను ఫ్లోరైడ్ రహితంగా మార్చాము.మట్టి గొప్పతనం గురించి సద్గురు చెప్పినట్లు మనం కూడా మన వంతు కృషి చేద్దామని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథితో పాటు పలువురు సేవ్ సాయిల్ వాలంటీర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. అంతకుముందు సందర్భాలలో మట్టి, మొక్కల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఎంపీ వివరించారు. సేవ్ సాయిల్ ఉద్యమం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మధ్య ఉన్న సారూప్యాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రముఖ గాయకులు మంగ్లీ, రామ్ మిరియాల,రమ్య బెహ్రా , సాహితీ చాగంటి, శ్రీ లలిత, సందీప్ల ప్రదర్శనలు ప్రజలను అలరించాయి. ఆ పాటలు మట్టితో ప్రజలకు ఉన్న అనుబంధాన్ని మరొక్కసారి చూపించాయి.
కార్యక్రమంలో పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు,రైతు నేస్తం ,ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆర్గానిక్ రైతు శ్రీ నాగరత్నం నాయుడు కూడా పాల్గొన్నారు. మట్టి ఆరోగ్యం కోసం పాటుపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా మట్టి సంక్షోభాన్ని పరిష్కరించడానికి సద్గురు ప్రారంభించిన ప్రపంచ ఉద్యమం మట్టిని రక్షించు. సాగు చేయదగిన నేలలో సేంద్రియ పదార్థాలను పెంచడానికి జాతీయ విధానాలు, చర్యలను, అన్ని దేశాల నాయకుల మద్దతు తీసుకురావడమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం.
మట్టి కోసం సద్గురు చేస్తున్న ఈ ప్రయాణం ఇప్పుడు 29 వ తేదీన భారతదేశాన్ని చేరుకోబోతుంది. సద్గురు యూరోప్ మరియు మిడిల్ ఈస్ట్లోని 26 దేశాలలో ప్రయాణించిన తర్వాత భారతదేశానికి చేరుకుంటున్నారు. భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో తన బైక్ రైడ్ను సద్గురు కొనసాగించనున్నారు. సద్గురు హైదరాబాద్కు జూన్ 15 న చేరుకోబోతున్నారు. వ్యవసాయ భూముల్లో కనీసం 3-6శాతం సేంద్రీయ పదార్థాలు ఉండేలా ప్రభుత్వాలను కోరడం ఈ ఉద్యమం యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇది లేకుండా, అన్ని వ్యవసాయ నేలలు వేగంగా క్షీణించి ఇసుకగా మారుతాయి, దీనిలో ఆహార పంటలు పెరగవు, ప్రపంచ ఆహార మరియు నీటి భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.
ప్రపంచ జనాభా 9 బిలియన్లు దాటినా 2045 నాటికి ఆహార ఉత్పత్తిలో ఎడారీకరణ 40శాతం తగ్గుదలకి దారితీస్తుందని UN ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) హెచ్చరించింది. UNCCD ప్రకారం, భూమి క్షీణత ప్రస్తుత రేటులో కొనసాగితే, 2050 నాటికి గ్రహం యొక్క 90శాతం ఎడారిగా మారవచ్చు – ఇప్పటి నుండి మూడు దశాబ్దాల కన్నా తక్కువ. మట్టిని రక్షించు ఉద్యమానికి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ (UNCCD) సహా వివిధ ప్రపంచ సంస్థలు మరియు ఏజెన్సీలు మద్దతు ఇస్తున్నాయి; ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP); ఫెయిత్ ఫర్ ఎర్త్, UNEP చొరవ, ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) మరియు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) మద్దతిస్తున్నాయి.
ఆయన ప్రయాణం ప్రారంభించిన మొదటి 50 రోజులలో, ఉద్యమం ఇప్పటికే 2 బిలియన్లకు పైగా ప్రజలను చేరింది, 74 దేశాలు మట్టిని రక్షించేందుకు చర్య తీసుకోవడానికి అంగీకరించాయి. 7 కరేబియన్ దేశాలు, అజర్బైజాన్, రొమేనియా, UAEలతో సహా అనేక దేశాలు నేలను కాపాడే విధానాలను రూపొందించడానికి “మట్టిని రక్షించు “తో అవగాహన ఒప్పందాలపై (MOUలు) సంతకం చేశాయి. 54 కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, అనేక పాన్-యూరోపియన్ సంస్థలు, ముస్లిం వరల్డ్ లీగ్ కూడా సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతుగా ముందుకు వచ్చాయి.
తాజావార్తలు
-
Mamata Banerjee: “ఇక మనం జాగ్రత్తగా ఉండాలి”.. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
-
Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
-
Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
-
DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
-
Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!