MP Dharmapuri Arvind: తెలంగాణకు కేసీఆర్ న్యూక్లియర్ బాంబ్లా తయారయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Dharmapuri Arvind Fires On CM KCR In BJP Munugodu Meeting: తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఒక న్యూక్లియర్ బాంబ్లా తయారయ్యారని మునుగోడు సమరభేరీలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. ఆయన దేశంలోనే అందరి కంటే పెద్ద అబద్ధాలకోరు అని, కేసీఆర్ పాలనను అంతమొందించి రామరాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తాడని భావించి కేసీఆర్కు ప్రజలు అధికారమిస్తే.. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. తమ పాలనలో భూముల రేట్లు పెరిగాయని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించామని చెప్తున్న కేసీఆర్.. భూనిర్వాసితులకు ఎందుకు పరిహారం చెల్లించడం లేదని ప్రశ్నించారు. శివలింగంపై తేలులా, గర్భగుడిలో గబ్బిలంలా కేసీఆర్ మారారని ఆరోపణలు చేశఆరు. మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రోడ్డు రోలర్లా తొక్కాలని, ఉప ఎన్నికలో పాపాల భైరవుడు కేసీఆర్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజల్ని కోరారు.
ఇదే సమయంలో బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని చూస్తే కేసీఆర్కి నిద్ర పట్టడం లేదన్నారు. మునుగోడులో ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ది పనులు చేపడుతోందని అన్నారు. ముంపు గ్రామాల్లోని వారికి పరిహారం, రోడ్లు వేయడం, పెన్షన్లు ఇవ్వడం లాంటివి చేస్తున్నారన్నారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవడం తప్ప, తెలంగాణలో ఏమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం కుంభకోణంలో డబ్బులు గుమ్మరించి.. ఖజానా మొత్తం ఖాళీ చేశారన్నారు. రైతుల బావుల దగ్గర మీటర్లు పెడతారంటూ.. విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శివన్నగూడెంలో రైతులను ముంచి, వారి భూములను గుంజుకుని ఆర్ఆర్ ప్యాకేజీకి కింద నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
- Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
- TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
- Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
తాజావార్తలు
-
పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
-
Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
-
Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
-
Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
-
Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!