Traffic Challan : ట్రాఫిక్ చలాన్ రూల్స్ మారాయి.. తెలుసా.!
- ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై కేంద్రం కఠిన నిర్ణయం
- చలాన్ చెల్లింపు 45 రోజుల్లో తప్పనిసరి
- ఐదు చలాన్ల కంటే ఎక్కువ ఉంటే లైసెన్స్ సస్పెండ్
- వాహనదారులపై బాధ్యత, డిజిటల్ మానిటరింగ్ & నోటీసులు
Traffic Challan : రహదారులపై వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ను విరుద్ధంగా పాటిస్తుంటే, ఇకపై కేంద్రం సీరియస్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా చలాన్ల (Traffic Challans) చెల్లింపులో నిర్లక్ష్యం చూపితే తగిన మూల్యం చెల్లించడం తప్పనిసరిగా, లేదంటే వాహనదారులు భారీ శిక్షలు పొందవచ్చు. కేంద్ర రవాణాశాఖ (Ministry of Road Transport & Highways) ఇటీవల సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989 (Motor Vehicles Act, 1989) లో కీలక సవరణలను ప్రతిపాదించింది.
చలాన్ చెల్లింపు కోసం కొత్త నియమాలు
చెల్లింపు గడువు: ఇప్పటి వరకు 90 రోజులలో చలాన్లు చెల్లించాలి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి చలాన్ను 45 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
లైసెన్స్ రద్దు: ఒక వాహనంపై ఐదు చలాన్లకు మించి ఉంటే, సంబంధిత అథార్టీ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయవచ్చు.
వాహన స్వాధీనం: చలాన్ చెల్లించకపోతే, పోలీసులకు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది.
లావాదేవీలు నిలిపివేత: చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోతే, ఆ వాహనంపై అన్ని రవాణా లావాదేవీలు నిలిపివేయబడతాయి. అంటే, వాహనం అమ్మకం, కొనుగోలు, లైసెన్స్లో చిరునామా, పేరు మార్పు, రెన్యువల్ ఇలా ఏమీ జరగదు.
డ్రైవింగ్ బాధ్యతపై కొత్త నిబంధనలు
ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో మాత్రమే జారీ అవుతున్నాయి. అయితే కొత్త రూల్స్ ప్రకారం, వాహనం నడిపిన వ్యక్తి అసలు యజమాని కాకపోతే, డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడిగా లెక్కింపబడతారు.
చలాన్ల మానిటరింగ్, నోటీసుల విధానం కేంద్రం ప్రతిపాదించిన డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం:
చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలు డిజిటల్ మానిటరింగ్ మరియు ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయబడతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే, సంబంధిత అధికారులు మూడురోజుల్లో ఇలక్ట్రానిక్ నోటీసు, 15 రోజుల్లో ఫిజికల్ నోటీసును జారీ చేయాల్సి ఉంటుంది.
కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. అదనంగా, ఈ-మెయిల్ ద్వారా కూడా అభ్యంతరాలను పంపవచ్చని (comments-morth@gov.in
) సూచించింది.
ఈ సవరణల ప్రధాన లక్ష్యం వాహనదారులలో ట్రాఫిక్ రూల్స్ పట్ల మరింత జాగ్రత్త, బాధ్యత పెంపొందించడం. ఇకపై చలాన్లపై నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని కఠిన చర్యలకు లోన చేయడం ద్వారా రహదారుల భద్రతకు కీలకంగా దోహదం అవుతుంది.
తాజావార్తలు
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!