Sad Incident: హైదరాబాద్లో మరో ఘోరం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sad Incident: హైదరాబాద్లో మరో విషాదం చోటుచేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలను విషమిచ్చి, ఆపై ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈరోజు ఉదయం బోరబండ డివిజన్లోని మధురానగర్లో సంచలనంగా మారింది.
హైదరాబాద్ కు చెందిన జ్యోతి, విజయ్ భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు. జ్యోతి బంజారాహిల్స్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీజర్గా పనిచేస్తుంది. కొద్దిరోజులు వరకు అన్యోన్యంగా సాగిన వారి జీవితంలో కలహాలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక గొడవతో భార్యభర్తలు తీవ్ర మనస్తాపానికి గురయ్యేవారు. ఇద్దరు భార్యభర్తలు అప్పటి వరకు బాగానే ఉన్నా.. ఏమైందో ఏమోకానీ.. భర్త బయటకు వెళ్లడం గమనించి తన ఇద్దరు పిల్లలు అర్జున్ (4), ఆదిత్య (2)లకు విషమిచ్చి చంపింది. ఆపై ఆమె కూడా ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త విజయ్ భార్య జ్యోతిని చూసి షాక్ తిన్నాడు. ఇద్దరు పిల్లకు కూడా విగతజీవిగా కనిపించడంతో భర్త విజయ్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అక్కడే వున్న స్థానికులు విజయ్ ను కాపాడారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న పిల్లలను కూడా జ్యోతి విషమిచ్చి చంపేంతగా వీరిద్దరి మధ్య గొడవ ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు, స్థానికులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
మరోవైపు ఇవాళ హైదరాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు వేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఓల్డ్ బోయిన్ పల్లి భవానీనగర్లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీకాంతా చారి(42) వెండి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇద్దరు కుమార్తెలు స్రవతి (8), శ్రావ్య (7)లకు కూడా నిద్రమాత్రలు వేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో బోయినపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాల కారణంగానే శ్రీకాంతాచారి ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Game Changer: దసరాకి ‘జాబిలమ్మ’ జాకెట్ వేసుకోని వస్తుందా? నమ్మకం లేదు శంకరా
తాజావార్తలు
-
PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
-
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
-
Manchu Manoj: మనోజ్కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
-
Mamitha Baiju: చేస్తే అలాంటి సినిమాలే చేయాలి..మమితా బైజు ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?