Heavy Rain Bhadradri: భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన తల్లీ కూతుళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామ పంచాయతీ కుమ్మరపాడులో విషాదం చోటుచేసుకుంది. ఉధృతమైన ప్రవాహంలో ఇద్దరు కూలీలు కొట్టుకుపోయారు. వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుమ్మరపాడుకు చెందిన కొందరు మహిళా వ్యవసాయ కూలీలు పొరుగు గ్రామానికి పనికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వెళ్లే దారిలో వాగు దాటాల్సి వచ్చింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 10 మంది కూలీలు ఒకరి చేతులు మరొకరు జాగ్రత్తగా పట్టుకుని దాటేందుకు ప్రయత్నించారు. నది మధ్యలోకి రాగానే వరద ఉధృతి పెరిగింది. దీంతో తల్లి, కూతురు నదిలో కొట్టుకుపోయారు. వాగు సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కూతురిని కాపాడారు. తల్లి నదిలో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన మహిళ కోసం ప్రస్తుతం అన్వేషణ కొనసాగుతోంది.
Read also: Imran Khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్కు పాక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరోసారి సమన్లు
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల కేంద్రంలో కూడా విషాదం నెలకొంది. స్థానిక సబితం జలపాతం అందాలను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సబితం జలపాతం కొత్త అందాన్ని సంతరించుకుంది. ఉప్పొంగుతున్న నదీ ప్రవాహాన్ని చూసేందుకు యువత ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తరలివస్తారు. అలా కరీంనగర్ లోని కిసాన్ నగర్ కు చెందిన మానుపాటి వెంకటేష్ అనే యువకుడు ప్రకృతి అందాలను తిలకించేందుకు పెద్దపల్లి వచ్చాడు. స్నేహితులతో కలిసి సరదాగా జలపాతాలు చూసేందుకు వచ్చిన వెంకటేష్ను విధి అనుకోకుండా చంపేసింది. స్నేహితులతో సరదాగా గడుపుతున్న వెంకటేష్ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అధికారులు జలపాతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
Read also: Rains in Warangal: వదలని వానలు.. డేంజర్ జోన్ లో వరంగల్..!
మంగళవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని వాగులో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. కొండేడు గ్రామానికి చెందిన అనూష(18), స్వాతి(18) నీటిలో పడి మృతి చెందారు. కొండేడు వద్ద ప్రవహిస్తున్న దుందుభి వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు. వారి ప్రాణాలను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా కాపాడలేకపోయారు. నదిలోంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు నిండిపోయాయి. నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాగులు, చెరువులు, రిజర్వాయర్లు, జలపాతాలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
Food Poisoning: వానాకాలంలో ఫుడ్ పాయిజనింగ్.. దాని లక్షణాలు, నివారణ మార్గాలివే
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!