Telangana Elections 2023: రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతలు.. మోడీ, అమిత్షా, యోగీ, జేపీ నడ్డా ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనాయకత్వం వరుస పర్యటనలకు సిద్ధమైంది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 8 రోజులుగా బీజేపీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి చెందిన పలువురు అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఒకరోజు పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రానికి రానున్నారు. పార్టీ, స్వతంత్ర సంస్థలు, ఇతర మాధ్యమాలు చేస్తున్న సర్వేల్లో రాష్ట్రంలో భాజపాకు సానుకూల ఫలితాలు వస్తాయన్న ధీమాతో జాతీయ నాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా నేడు, రేపు, (25, 26, 27) తేదీల్లో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో బీజేపీ అగ్రనేతలు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారని సమాచారం.
Read also: Shruti Haasan : శృతిహాసన్ పాటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ఈ పర్యటనలో మోడీ రాజ్భవన్లో బస చేస్తారని వార్తలు వచ్చాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూబ్లీహిల్స్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముథోల్, సంగారెడ్డి, నిజామాబాద్ అర్బన్ లలో సభలకు హాజరై హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి (25,26, 27) తేదీల్లో వివిధ జిల్లాల్లో నిర్వహించే సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు. అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 28న రోడ్ షోతో ఆయన పర్యటన ముగిసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 25, 26 తేదీల్లో 10 బహిరంగ సభల్లో పాల్గొంటారని సమాచారం. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆరు సమావేశాల్లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారని సమాచారం.
Kotta Manohar Reddy: మహేశ్వరంలో కొత్త మనోహర్ రెడ్డి ప్రచారం.. అడుగడుగున ప్రజల నీరాజనం
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!